చంద్రబాబును నమ్మితే రాజకీయాల్లో మనుగుడ ప్రశ్నార్థకమే అని మరో సీనియర్ నాయకుడికి అవగతమయ్యింది . రాజోలు నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు సూర్యారావు. 2004 లో ఎమ్మెల్యే గా గెలిచి వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పని చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి 2019 సార్వత్రిక ఎన్నికలలోపోటీ చేసి ఓటమి చెందాడు. ఓటమి చెందినా కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా కార్యకర్తలకు భరోసాగా అక్కడే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేశాడు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసిన సమయంలో ఖర్చు అంత భరించి టికెట్ హామీ పలు దఫాలుగా పొందినా మొదటి లిస్టులో పేరు లేకపోవడం, చివరికి IVRS కాల్స్ లో కూడా తన పేరు లేకుండా కొత్త పేరుతో సర్వే నిర్వహించాడు చంద్రబాబు. పొత్తులో భాగంగా రాజోలు సీట్ జనసేనకు కేటాయిస్తే టికెట్ నీకు పి.గన్నవరం సీట్ ఇస్తా అని నమ్మించి చివరికి తనకు చెప్పకుండానే సరిపెల్ల రాజేష్ కు పి గన్నవరం టికెట్ ప్రకటించాడు బాబు. ఇలా రోజూ రోజుకి తనను నమ్ముకున్న నాయకులును ముంచడం బాబుకి పరిపాటిగా మారిపోవడంతో పలువురు సీనియర్లు అంతర్గతంగా రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం