ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్న అసూయతో ఆయన కులానికి చెందిన కొందరు కుమిలిపోతూ వచ్చారు.. వారంతా సీఎం జగన్ పై ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానిపై బురద జల్లడం ఈ పెద్ద మనుషులకు అలవాటు..
జగన్ పై ముందు నుంచి నిమ్మగడ్డ ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ, చలసాని, గరుడ పురాణం శివాజీ దాడి చేయడం ప్రారంభించారు. పాలనలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను భరించలేక ఆయనపై విషప్రచారం చేయడం వీరందరికీ పరిపాటిగా మారిపోయింది. వీరికి వంత పాడుతూ మీడియా & జర్నలిజం ముసుగులో ఈనాడు రామోజీరావు ,ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ , టీవీ5 బీఆర్ నాయుడు , మహా న్యూస్ వంశీ అసత్య కథనాలను వండి వారుస్తూ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీపీఐ నారాయణ, బీజేపీ పురంధేశ్వరి చౌదరి వారికి జత కలిశారు.
వీరందరూ జగన్ పై నలువైపులా దాడి చేస్తుంటే చంద్రబాబు మాత్రం దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సాయంతో నేరుగా దాడికి దిగడం గమనార్హం. ఇలా కౌరవుల్లా గుంపుగా సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నా మొక్కవోని ధైర్యంతో కురు సంగ్రామంలో కౌరవ సేనను చీల్చి చెండాడిన గాండీవధారి అర్జునిడిలా ఎదుర్కొంటూ ప్రత్యర్థుల కుటిల యత్నాలను సమర్థంగా అడ్డుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల్లో జగన్ కి దక్కుతున్న ఆదరణ ప్రత్యర్థులకు కడుపు మంటగా మారింది. ఎవరెన్ని ఎత్తులు వేసినా మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ప్రజల్లో వినిపిస్తున్న మాట..