మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రను తలపిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నినా ఫలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. గుడివాడ సభ ప్రసంగం హైలెట్గా నిలిచింది. ఇక స్టే పాయింట్ల పార్టీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కాంగ్రెస్ల చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యాత్ర 16వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతోంది. ఇక్కడ రహదారులు జననేత కోసం కిక్కిరిశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ను చూసేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. గణపవరంలో సీఎంకు ఘన స్వాగతం లభించింది.
గణపవరం ప్రజలు దారి పొడువునా చేరి నీరాజనాలు పలికారు. ప్రజలతో మమేకమవుతూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. నిడమర్రు చేరుకున్న బస్సుయాత్రను చూసేందుకు అక్కచెల్లెమ్మలు పోటెత్తారు. వారిని పలకరించేందుకు స్వయంగా జగన్ బస్సు దిగారు. అభివాదం చేశారు. అనంతరం సీతారామపురం చేరుకున్న యాత్రకు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఓ బాలిక గీసిన తన స్కెచ్పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అనారోగ్య సమస్యలపై అనేకమంది సీఎంకు వినతులు అందజేయగా భయపడొద్దని భరోసా సీఎం కల్పించారు. చికిత్స చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం భీమవరం చేరుకుని బహిరంగ సభకు జగన్ హాజరయ్యారు.