2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ను రేపు దాఖలు చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగియనుంది. చివరి మేమంతా సిద్ధం సభ ముగిసిన తర్వాత టెక్కలి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి గన్నవరంకి విమానంలో వస్తారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు గన్నవరం నుంచి కడప చేరుకుంటారు. కడప నుంచి […]
నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తొలుత రామ్మూర్తి నగర్లోని క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం విజయసాయిరెడ్డి నెల్లూరులోని కలెక్టరేట్కు చేరుకుని ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట స్నేహితుడు, రాజ్యసభ్య సభ్యుడు బీద రవిచంద్ర, కుమార్తె నేహారెడ్డి తదితరులున్నారు. […]
2024 సార్వత్రిక ఎన్నికలకు 3 వారాల సమయం కూడా లేదు వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 99 శాతం ఆ […]
జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రతి ఊరి నుంచి చిన్నాపెద్దా కదిలారు. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మండుటెండలను సైతం లెక్క చేయలేదు. సంక్షేమ పథకాలు అందించిన నాయకుడికి సంతోషంగా మద్దతు పలికారు. సమస్యలున్న వారు ఆయనకు చెప్పుకొని పరిష్కారం పొందారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ల నుంచి చేరికలైతే వెల్లువలా జరుగుతున్నాయి. నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులు వైఎస్సార్సీపీ […]
‘ఓ లంచాల బాబు.. ఓ జన్మభూమి కమిటీల బాబు.. నీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబూ.. చెప్పవయ్యా.. ఏనాడైనా ప్రజలకు మంచి చేశావా?’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా చింతపాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్ర చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. వచ్చే 5 ఏళ్లు […]
‘ఐదేళ్ల పాలనలో జగనన్న అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. రాష్ట్ర ప్రజానీకం ఆయన వెంటే ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. శనివారం అనకాపల్లి జిల్లా చింతపాళెంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారు. […]
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆశయాలను సాధించేందుకు కష్టపడి పనిచేస్తానని ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. నెహ్రూ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. నెహ్రూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పని చేశారు. ఐదుసార్లు శాసనభ్యునిగా, ఒకసారి మంత్రిగా ఉన్నారు. పేద ప్రజల కోసమే బతికారు. మాట […]
ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వారి వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ జాతీయ స్థాయి సర్వే సంస్థలతో పాటు మెజారిటీ సర్వేలన్నీ వైసీపీదే అధికారం అంటూ స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో అధికార వైసీపీ విజయం సాధిస్తుందని టీడీపీ కూటమి కేవలం 4-5 […]
ఎన్నికల ప్రచారంలో గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత దూసుకుపోతున్నారు. నిన్నటి వరకు కొవ్వూరు ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన తానేటి వనిత ఇప్పుడు తన సొంత నియోజకవర్గం అయిన గోపాలపురం నుండి పోటీ చేయబోతున్నారు. అభ్యర్థిగా ప్రకటించి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు చుట్టి వచ్చారు. మొత్తం 80 గ్రామాలు ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. జగన్ గారు చేసిన సంక్షేమం, అభివృద్ది పనులను ప్రజల్లోకి […]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ కంచుకోట వైసీపీ పుట్టిన తరువాత ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గం అయిన మండపేట లో ఒకేసారి 800 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ పార్టీ గెలుపుకు కృషి చేస్తాము అని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ ను అవహేళన చెయ్యడంతో మొదలైన రాజీనామాలు ఈరోజు వరకు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశే వరకూ వెళ్ళింది , చూస్తుంటే ఈ రాజీనామా […]