‘ఐదేళ్ల పాలనలో జగనన్న అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. రాష్ట్ర ప్రజానీకం ఆయన వెంటే ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. శనివారం అనకాపల్లి జిల్లా చింతపాళెంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడారు.
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చారు. ప్రతి ఇంటికీ సంక్షేమం అందించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు జనం వెల్లువలా తరలివచ్చారు. పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీంతో పథకాలు ఇళ్ల ముంగిటే అందాయి. దీనికి కారణమైన జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. 2024లో వన్స్ మోర్ జగనన్న అని కృతజ్ఞతగా మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీకు మేము తోడుగా ఉన్నామని చెబుదాం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక ప్రతిపక్షాలు వైఎస్ జగన్ను అంతమొందించాలని చూశాయి. ప్రజలంతా ఓటును ఆయుధంగా మార్చుకోవాలి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన బెంబేలెత్తేలాగా తీర్పు ఇవ్వాలని. జూన్ 4వ లెక్కింపు మొదలవగానే ఫ్యాన్ ప్రభంజనం ప్రతి నియోజకవర్గంలో మొదలవుతుంది. వైఎస్సార్సీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా.