వాస్తవాలకు పాతరేస్తూ ప్రభుత్వంపై విషపు రాతలతో విరుచుకుపడుతున్న రామోజీ మరోసారి జగన్ సర్కారుపై తన అక్కసును వెళ్లగక్కారు. ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేందుకు రామోజీ చేయని ప్రయత్నం లేదు. తాజాగా మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర అంటూ పూర్తి వక్రీకరణలతో కూడిన కథనాన్ని వండి వార్చి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బెరైటీస్ గనుల టెండర్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాల మంగంపేటలోని […]
అన్నదాతకు విత్తు నుంచి విక్రయం వరకు జగన్ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు తోడుగా నిలబడుతున్న జగన్ సర్కారుపై నిస్సిగ్గుగా ఈనాడు అవాస్తవ కథనాలను ప్రచురిస్తూ అబద్ధపు ప్రచారాన్ని చేస్తోంది. తాజాగా వరి వైకాపా పెద్దలకు సిరి అంటూ మరోసారి ఓర్వలేని నీచపు కథనాన్ని వండి వార్చింది. ఈనాడు ప్రచురించిన కథనంలో ఐదేళ్ళలో వడ్లు, బియ్యం రూపంలో రూ.౩౦ వేల కోట్ల […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు డైరక్షన్లో ఈనాడు రోజూ విషం కక్కుతూనే ఉంది. తనకు నచ్చని వారిపై దశాబ్దాలుగా అబద్ధాలను ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న పత్రిక ఇది. బాబు ప్రభుత్వంలో అవినీతి జరిగినా దాని కంటికి కనిపించదు. సాక్షాత్తు నారా వారు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా ఎదుటివారిపైనే బురద జల్లుతుంది. తాజాగా ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ పేరుతో ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి […]
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికల గురించి తిరుపతిలో ‘ఇండియా టుడే’ నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి(జగన్) పాల్గొన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్(రాజ్ దీప్) అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలుగా 2019 లో తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి – ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో మొదలుపెట్టి అంతర్జాతీయ సిలబస్ ప్రవేశ పెట్టడం […]
ఈనాడు పత్రిక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పైన విషం చిమ్మడానికి ఎంతలా ప్రయత్నిస్తుంది అంటే రామాయపట్నం పోర్ట్ మొదటి దశ పూర్తి చేసుకొని ప్రారంభంకి సిద్దంగా ఉంటే పచ్చ కళ్ళకు గంతులు కట్టనట్లు ఏమి అభివృద్ది జరగనట్లు వార్తను ప్రచరించింది. అక్కడికి వెళ్లి చూస్తే కదా నిజ నిజాలు తెలిసేది, 10 లక్షల ఇళ్ళకి ఈనాడు ప్రతులను ఫ్రీ గా వేస్తున్నాం కదా చెప్తే నమ్మెస్తారులే అని ధీమా కావొచ్చు , రోజులు మారాయి రామోజీ, ఇంకా […]
ఫిలిం సిటీలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం.. 15 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములను రామోజీ తన అధీనం లో ఉంచుకోవడంపై ప్రశ్నిస్తూ.. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు రామోజీకి బహిరంగ లేఖ రాశారు. గోనె ప్రకాశరావు రామోజీని బహిరంగ లేఖతో సూటిగా ప్రశ్నిస్తూ.. పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనంలోనే ఉన్నాయి. నాగన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 […]
ఊర్లో ఎక్కడ ఏం జరిగినా.. బెడ్రూంలోకి కూడా దూరిపోయి న్యూస్ అందించడానికి వెనుకాడని పత్రికను నడిపే ఆ అధినేత మాత్రం తన సంస్థలో జరిగిన అతి ఘోర ప్రమాదాన్ని బయటకు రానీయకుండా చేసిన వైనమిది. ఇందులో నష్ట పడ్డవారు ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన వారు కాబట్టి ఈ మాత్రం వివరాలైనా బయటకొస్తున్నాయి కానీ, అదే సామాన్య మనుషులనైతే తమ డబ్బు బలంతో, రాజకీయ అండతో నోరు నొక్కేసేవారే! ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీ విస్టెక్స్ తన […]
రాష్ట్రములో ఉన్న కులజాఢ్యానికి కేంద్రబిందువు , కనీసం ఇల్లు అద్దెకు కావాలంటే కులపరీక్షకు నిలవాల్సిన ప్రాంతం, కులాధిపత్యానికి అడ్డువస్తున్నారని ప్రత్యర్థి కులం నాయకుడి పై ప్రభుత్వ ముఖ్యల ప్రణాళికలతో మారణహోమం సాగించిన ప్రాంతం, పైన అమ్మవారు, కింద .. వారు అని ఇతర వర్గాల ప్రజలంటే లెక్కలేకుండా గర్వంగా చెప్పుకొనే ప్రాంతం అదే.. అదే విజయవాడ . అక్కడి నడిబొడ్డున 206 అడుగుల నిలువెత్తు బడుగు బలహీనుల ఆరాధ్యదైవమే కాదు దేశానికి ప్రజాస్వామ్య బాటలను, ప్రజలకు మానవ […]
దేశవ్యాప్తంగా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి ఈడు పిల్లలు అంతా పూర్తిగా బడులకే వెళ్లాలన్న అత్యుత్తమ లక్ష్యంతో జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ కూడా ఏడాదికి రూ.15,000 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. ఈ రకంగా ఈప్రభుత్వం హయాంలో 44,48,865 మంది తల్లులకు రూ.26,067.3 కోట్లను అమ్మ ఒడి కింద తల్లుల ఖాతాల్లో జమచేసింది. కానీ రాష్ట్రంలో […]
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం ఈనాడుకు పరిపాటిగా మారింది. పొదుపు సంఘాల అప్పులను మాఫీ చేస్తానని డ్వాక్రా మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు విషయంలో ఏనాడూ నోరెత్తని రామోజీ డ్వాక్రా సంఘాలను ఆదుకున్న సీఎం జగన్ పై మాత్రం అసత్య కథనాలను ప్రచురిస్తుండటం రామోజీలో జగన్ పై ఉన్న ద్వేషానికి పరాకాష్టగా చెప్పొచ్చు. వాస్తవానికి 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు బేషరతుగా మాఫీ చేస్తానన్న పొదుపు […]