బొత్తిగా వ్యూస్ లెక్క పెట్టుకునే యూట్యూబ్ థంబ్ నెయిల్ బ్యాచ్లా తయారయింది ఈనాడు పరిస్థితి. ఆంధ్ర ఏదైనా మంచి జరిగితే వెంటనే వక్రపు వెక్కిరింతల వార్తల్ని వండి వడ్డించడమే ఈ దినపత్రిక దినచర్యగా మారింది. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం 6100 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతే… ఇంక విషపు రాతలు మొదలయ్యాయి. రామారావు లక్ష్మి పార్వతి టైములోలా అబద్ధాలు రాస్తే అవే నిజమనుకోవడానికి ప్రజలు అమాయకులు కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది […]
జగన్ ప్రభుత్వంపై అక్కసుతో రగిలిపోతూ, ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చేలా విద్వేషపూరిత కథనాలను ప్రసారం చేస్తున్న ఈనాడు మరోసారి జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఈసారి పాడి రైతుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు ప్రయత్నం చేస్తున్న అమూల్ పై విష ప్రచారానికి పూనుకుంది. ప్రభుత్వం కొన్ని డైరీలను అమూల్ పరం చేస్తుందంటూ వాస్తవ దూర కథనాలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఈనాడు. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. పాడి రైతులను […]
సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లను సేకరించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం మొదలుపెట్టిందో అప్పటినుండి మార్గదర్శి కేసు వేగం పుంజుకుంది. తాజాగా మార్గదర్శికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి ఫైనానిషియర్స్ కేసులో తొలిసారి ఆర్బీఐ […]
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు మొత్తం వెనక్కి వెళ్లిపోతున్నాయి , ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఇక్కడ నుంచి తరలి వెళ్లిపోతున్నాయి 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ రాసుకొచ్చాడు , తీరా లోపల చూస్తే అమర రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది అని రాసాడు. మిగిలిన 1 లక్ష 13 వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా వెళ్లాయి అనే దానికి […]
ఈనాడు మొత్తం 24 పేజీల పత్రిక. వాళ్ళ టాగ్ లైన్ ప్రకారం అయితే అత్యధిక ప్రచురణలు జరిగే తెలుగు దినపత్రిక. ఇంటిల్లిపాదికీ ఉపయోగపడే అంశాలు వేసే ఫీచర్ పేజీలను రోజుకొకటి చొప్పున వేసి తెలుగు ప్రజలను ఉద్ధరిస్తున్న పత్రిక. మరి అందులో 06వ పేజీ సంపాదకీయం కోసమనీ, 10 పేజీ వసుంధర – మహిళల కోసమనీ, 12 పేజీ క్రీడల కోసమనీ, 15, 17 పేజీలు జాతీయ వార్తల కోసమనీ, సినిమా రంగం కోసమై 18 పేజీ, […]
నాడు కళాంజలి పేర రామోజీ స్మగ్లింగ్ దందా..
రాష్ట్రంలో ఏ మంచి జరిగినా అది వై.యస్. కుటుంబం కోసం చేసిన పనే అంటూ విషం చిమ్మడం ఈనాడుకు రోజువారీ పని అయిపోయింది. ఈరోజు వాటాగా "వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ. 30 లక్షలతో రోడ్డు" అంటూ ఈనాడు తప్పుడు రాతలు రాసి తన స్వామి భక్తిని చాటుకుంది.
రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ను […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కి తనేం చేసినా అదో మహత్కార్యం.. అవతలి వ్యక్తి ఏం చేసినా అదో పెద్ద నేరం లా కనిపిస్తుంటాయి… తెల్లారి లేస్తే తెలుగు ప్రజలందరికీ “అటా” అంటూ నీతులు వల్లిస్తూ తను మాత్రం ఏ నీతి లేకుండా బతికెయ్యడం, తనదే నీతివంతమైన “ బతుకు “ అని బ్రమలో బతకడం రాధాకృష్ణ కి సహజ నైజం.. వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానికి ఎలా అయినా అడ్డుపుల్ల వేయాలనుకుని ఆ […]
ఈనాడు పత్రికను జగన్ పైన విషం చిమ్మడానికే రామోజీ పెట్టుకున్నట్లున్నాడు. నాడు నేడు కింద 45వేల పాఠశాలల రూపు రేఖలు మార్చింది వార్తే కాదు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడం చేత ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథమికోన్నత లేదా జిల్లా పరిషత్ స్కూల్ కు విద్యార్థులను పంపిస్తే మాత్రం భూతద్దంలో చూపిస్తూ పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు. రామోజీరావుకు నూతన విద్యా విధానం వచ్చిందని తెలియదేమో. గతంలో ఉన్నట్లు ఒకటో తరగతి నుంచి అయిదో […]