సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు మొత్తం వెనక్కి వెళ్లిపోతున్నాయి , ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఇక్కడ నుంచి తరలి వెళ్లిపోతున్నాయి 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ రాసుకొచ్చాడు , తీరా లోపల చూస్తే అమర రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది అని రాసాడు. మిగిలిన 1 లక్ష 13 వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా వెళ్లాయి అనే దానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.
అమరరాజా బ్యాటరీస్ టీడీపీ ఎంపీ గళ్ళ జయదేవ్ కు చెందిన కంపెనీ చిత్తూర్లో అలాగే ఉంది ,ఎక్కడికీ పోలేదు. ఆ కంపెనీ నుంచి వచ్చే వ్యర్ధాల వలన వలన చుట్టుపక్కల గ్రామాల నీరు కలుషితం అవుతుంది సరి చేసుకోండి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీస్ ఇచ్చింది , హై కోర్ట్ కూడా సమర్ధించింది . అమరారాజ వాళ్ళు విస్తరణ లో భాగంగా తెలంగాణలో కూడా తమ కంపెనీ మొదలెడతాం అని చెప్పారు అంతే కానీ రామోజీ చెప్పినట్టు అమరరాజా పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళలేదు .
నిజానికి ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పవచ్చు . పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గత 3 ఏళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ట్రాన్స్పరెన్సీతో ప్రాజెక్టులు నిర్వహణ చేస్తుంటే రామోజికి మాత్రం అది కనపడదు. 2023 మార్చిలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మొత్తం 13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా 2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఒక్క ఏడాదిలోనే ఏపీలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని దేశవ్యాప్తంగా ఒప్పందాల్లో వాస్తవ రూపం దాల్చేది 17 శాతంలోపు ఉండగా ఏపీలో మాత్రం ఏపీలో ఏడాదిలోపే 19 శాతం వాస్తవ రూపంలోకి వచ్చింది. ఈ నిజాలు మాత్రం ఎన్నడూ రాయడు రామోజీ .
దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ–చెన్నె, చెన్నె–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాదు 3 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నాయని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.1,000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడ్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ఈ రెండు పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘంగా 974 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుమారు రూ.20 వేల కోట్లతో 4 ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మరో 4 వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగానే గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి దొరికిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
చంద్రబాబు హయంలో కొన్ని కంపెనీలకు నామ మాత్రపు లీజుతో ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది అయినా ఆ కంపెనీలు గ్రౌండ్ చేయకపోవడం గమనార్హం. మొదటగా లులూ గ్రూప్ , లులు అనేది ఒక షాపింగ్ మాల్, బాబు మాత్రం కన్వెన్షన్ సెంటర్ పేరుతో విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.680 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపునకు కట్టబెట్టింది. 2017లో లీజుకు తీసుకున్న లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి లీజు కూడా చెల్లించలేదు. కనీసం ఒక ఇటుక పేర్చలేదు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని రద్దు చేసి రూ.వందల కోట్ల విలువైన భూమిని సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. ఇదే విశాఖలో రహేజా గ్రూప్ కు జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించిన ఒక నెలలోనే పనులు మొదలుపెట్టి దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ఇనార్బిట్ మాల్ కడుతుంటే మాత్రం కనపడదు. ఇనార్బిట్ మాల్ రూ.600 కోట్లతో 13 ఎకరాల్లో విశాలంగా నిర్మిస్తున్న ఇనార్బిట్మాల్ ద్వారా 8 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
బాబు హాయంలో సెబీ 5 కోట్లు జరిమానా విధించిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే మరో కంపెనీకి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన ఆ వ్యక్తికి చెందిన సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ఫ్రాన్సిస్కోలో కేవలం పది ఎకరాల్లో ఉండగా ఇక్కడ మాత్రం 400 కోట్లు విలువ చేసే 40 ఎకరాలును రూ.13కోట్లకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపినా లెక్క చేయలేదు. ఫ్రాంక్లిన్తో భాగస్వామ్యం ఉన్న ఓ సంస్థ అధినేత చంద్రబాబు కులస్థుడు కావడం దీనికి ప్రధాన కారణం.అనంతరం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా భారీ రుణాల కుంభకోణంలో ఇరుక్కోవడంతో సంస్థ వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29 వేల కోట్ల విలువైన ఆరు డెట్ ఫండ్స్ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో భారత్లో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. దీనికి జగన్ యే కారణం అని చెప్తాడు రామోజీ.
విశాఖ నుంచి హెచ్ఎస్బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు కథనాలు ప్రచురించింది. వాస్తవానికి 2017లో కంపెనీలో భారీగా అవకతవకలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు 2018లోనే హెచ్ఎస్బీసీ ప్రకటించింది.ఇందులో భాగంగా 3,500 మందితో నిర్వహిస్తున్న విశాఖతో పాటు చెన్నై, కోల్కతాలో సంస్థ కార్యాలయాలను మూసివేసింది. ఇదే భవనంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రపంచ స్థాయి బీపీఎం సంస్థ డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ 3,500 మందితో కార్యకలాపాలను ప్రారంభించింది.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా తాను ఉన్న అయిదు సంవత్సరాలు ప్రజలకి ఏమి చేయాలి అనుకోడు , 20 ఏళ్ల తర్వాత ఏమి చేయాలి అని ఆలోచనల చేస్తున్నట్లు ప్రచారంతో గడిపేస్తాడు , అలానే ఆదానీ డేటా సెంటర్ చంద్రబాబు హయాంలో వచ్చే 20 ఏళ్లలో ఆదానీ డేటా సెంటర్ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకొంది అని ఈనాడు రాసింది నిజానికి. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 ఏళ్లు అంటే చాలా సుదీర్ఘ సమయమని, అప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో పెనుమార్పులు వస్తాయి కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఎంత వాస్తవ పెట్టుబడి పెడతారో డీపీఆర్ ఇవ్వాల్సిందిగా కోరింది. దీని ప్రకారం ఐదేళ్ల కాలానికి రూ.21,844 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆదానీ గ్రూపు స్పష్టంచేసి దానికనుగుణంగా ఇప్పటికే పనులను మొదలుపెట్టంది. ఇప్పుడు ఆదానీ డేటా సెంటర్ను వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అభివృద్థి చేస్తోంది.
డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి డేటా ప్రకారం బాబు దిగిపోయిన 2019లో రాష్ట్రంలో స్టార్టప్ ల సంఖ్య-161 ఇప్పుడు వాటి సంఖ్య- 586 దాదాపు 4 రెట్లు పెరిగిన స్టార్టప్ కంపనీల సంఖ్య అయినా ఈనాడుకు కడుపుమంట. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల పాలసీ నచ్చి విస్తరణ చేపట్టిన కంపెనీలు ఆపాచి 820- కోట్లు ,దివీస్ 2 కొత్త ప్లాంట్లు- 1480 కోట్లు ,ఈనాడు ఏమో కియా వెళ్ళిపోతుంది అంటూ కథనాలు రాస్తుంది,కియా ఏమో 400 కోట్లు అదనంగా పెట్టుబడి పెడుతుంది. యోకోహోమా 680 కోట్లు,సెంచురీ ప్లైవుడ్ మొదటి ప్లాంట్ 2021 డిసెంబర్లో పెట్టాక మరో రెండు ప్లాంట్లు నెలకొల్పుతోంది మాండలీజ్ చాక్లెట్స్ -1600 కోట్లు ,ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రూ.4వేల కోట్ల పెట్టుబడి,ఏటీసీ టైర్స్ లిమిటెడ్ రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ,ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ కూడా రూ.933 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇలా మరో ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టి విస్తరణ చేస్తుండగా ఈనాడుకు ఏడుపు మాత్రం తగ్గడం లేదు.