రాష్ట్రంలో ఏ మంచి జరిగినా అది వై.యస్. కుటుంబం కోసం చేసిన పనే అంటూ విషం చిమ్మడం ఈనాడుకు రోజువారీ పని అయిపోయింది. ఈరోజు వాటాగా "వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ. 30 లక్షలతో రోడ్డు" అంటూ ఈనాడు తప్పుడు రాతలు రాసి తన స్వామి భక్తిని చాటుకుంది.
రాష్ట్రంలో ఏ మంచి జరిగినా అది వై.యస్. కుటుంబం కోసం చేసిన పనే అంటూ విషం చిమ్మడం ఈనాడుకు రోజువారీ పని అయిపోయింది. ఈరోజు వాటాగా “వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ. 30 లక్షలతో రోడ్డు” అంటూ ఈనాడు తప్పుడు రాతలు రాసి తన స్వామి భక్తిని చాటుకుంది.
వాస్తవానికి మూడు గ్రామాల రైతుల కోరిక మేరకు రోడ్డు నిర్మాణం జరిగింది. మేదరమెట్ల, అనమనమూరు రోడ్డులో.. అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్రోడ్డు వరకూ 2.5 కిలో మీటర్ల మేర ఉపాధిహామీ నిధులతో రెండు సంవత్సరాల క్రితం తారురోడ్డు వేశారు. ఈ రహదారి పరిధిలో కొరిశపాడు మండలం అనమనమూరు, అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామాలున్నాయి. మణికేశ్వరం వద్ద దక్షిణకాశీగా పేరుగాంచిన శైవక్షేత్రం ఉండగా, ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
ఇక మూడు గ్రామాల పరిధిలో సుమారు నాలుగు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో రైతులు వరి, మామిడి, పుచ్చ తదితర పంటలు పండిస్తున్నారు. నిత్యం రైతులు రాకపోకలు సాగిస్తారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. చిన్నపాటివర్షం కురిసినా రాకపోకలకు వీలుకాని పరిస్థితి.
వైవీ సుబ్బారెడ్డి మేదరమెట్లకు చెందిన వారు కావడంతో అనమనమూరు, కొంగపాడు, మణికేశ్వరం గ్రామాల రైతులు, ప్రజలు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గతంలో వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీంతో 2005లో మేదరమెట్ల నుంచి అనమనమూరు వరకూ తారురోడ్డును మంజూరు చేయించిన సుబ్బారెడ్డి.. అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ గ్రావెల్ రోడ్డును సైతం మంజూరు చేయించారు.
రెండు సంవత్సరాల క్రితం అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ రెండేళ్ల క్రితం తారురోడ్డు పూర్తికావడంతో మణికేశ్వరం, శైవక్షేత్రంలకు వెళ్లే భక్తులకు నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గింది. దూరాభారం తగ్గి, మెరుగైన రోడ్డు రావడంతో స్థానికులు ఆనందంగా ఉండటం.. రామోజీకి కంటగింపుగా మారింది.
వైవీ సుబ్బారెడ్డి కుటుంబీకులకు నలభై ఎకరాలు కూడా లేని చోట.. ఏకంగా వంద ఎకరాలు ఉన్నాయంటూ ఈనాడు వక్రీకరించింది. ఇలాంటి అబద్ధపు రాతలు రాసిన ఈనాడుపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో గ్రావెల్ రోడ్డు వేసినప్పుడూ ఇలాంటి రాతలే రాశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుశా రేపు పులివెందులలో ఏదైనా రోడ్డు వేస్తే వైఎస్ కుటింబీకుల కోసమే అని రాస్తాడేమో రామోజీ