ఈనాడు మొత్తం 24 పేజీల పత్రిక. వాళ్ళ టాగ్ లైన్ ప్రకారం అయితే అత్యధిక ప్రచురణలు జరిగే తెలుగు దినపత్రిక. ఇంటిల్లిపాదికీ ఉపయోగపడే అంశాలు వేసే ఫీచర్ పేజీలను రోజుకొకటి చొప్పున వేసి తెలుగు ప్రజలను ఉద్ధరిస్తున్న పత్రిక.
మరి అందులో 06వ పేజీ సంపాదకీయం కోసమనీ, 10 పేజీ వసుంధర – మహిళల కోసమనీ, 12 పేజీ క్రీడల కోసమనీ, 15, 17 పేజీలు జాతీయ వార్తల కోసమనీ, సినిమా రంగం కోసమై 18 పేజీ, 19 పేజీ బిజినెస్కిచ్చి,
20, 21 పేజీలు ప్రతిభ విద్యార్థుల కోసం వేసి, 22 పేజీ హాయ్ బుజ్జి అని చిన్న పిల్లల పేజీ ఇచ్చి, 23 పేజీ సిరి – అంటే బిజినెస్ పేజీ ఇలా అంటే మొత్తం 24 పేజీలలో 11 పేజీలతో మనల్ని ఉత్తేజపరిచే పత్రిక అన్నమాట.
మరి ఇన్ని పేజీలలో తెలుగు ప్రజలను రంజింప చేస్తే సరిపోతుందా??? మరి వారి భవిష్యత్తు, కలల సాకారం, ముందు తరాలకు రాబోవు ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ సింగపూరు గా మారే గ్రాఫిక్స్ ఇటువంటివి వేయొద్దా??? వేయాలి కదా. అందుకని ఈనాడు ఏం చేయాలి ? తనకు నచ్చిన నాయకుడి భజన చేయాలి. మరి నాయకుడికి అధికారం లేకపోతే ఏం చేయాలి?? అధికారం ఉన్నోడి మీద బురద చల్లాలి.
అంటే ఎంత చల్లాలి? రెండు మూడు పేజీలలో వ్యతిరేక వార్తలు రాస్తే సరిపోతుందా?? అబ్బే అంత తక్కువ రాస్తే మన నాయకుడికి అధికారం వచ్చేది ఎప్పుడూ? అసలే ఆయన 74 ఏళ్ళు వెనకేసుకుంటే?? అందుకే ప్రతి పేజీలో విషం చిమ్మాలి. కనుక పైన చెప్పిన 11 పేజీలు తీసేస్తే మిగిలింది 13 పేజీలు. మనం ఎప్పుడైనా సరే మిగతా పదమూడు పేజీలను గమనిస్తే… ప్రతి పేజీలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలే. అవి కూడా నిజాలు అయితే పర్వాలేదు. ప్రతి వార్తా వండి వడ్డించిన బాపతే.
అదే వాళ్ళు నాయకుడు అధికారంలో ఉండి, ఆయన ఢిల్లీలో ఏదైనా చిన్న ప్రెస్ మీట్ కనుక పెడితే, వెంటనే… “ఢిల్లీ అష్ట దిగ్బంధనం”, “బాబు చాణిక్యంతో గజగజ వణికించిన ఢిల్లీ ” అంటూ షడ్రుచోపేతంగా ఎంగిలి కూడుని పత్రిక అంతా వడ్డిస్తుంది. మరి దీనిని పత్రిక అనాలో… డబ్బులిచ్చి కొనుక్కునే పాంప్లేటు అనాలో ప్రజలకే తెలియాలి.