నాడు కళాంజలి పేర రామోజీ స్మగ్లింగ్ దందా..
పొద్దున లేస్తే ప్రపంచానికి నీతులు చెప్పే రామోజీ, స్టీల్ ప్లాంట్ కడితే కడపలో సెలయేర్లు, కొండలు, గుట్టలు, అడవి జింకలు, అడవి ఆవులు అన్ని అంతర్థానం అయిపోతాయి అని వన్యప్రాణుల గురించీ, సహజ వనరుల గురించి తెగ బాధపడే రామోజీ, దేశ సంపదని, వారసత్వ చిహ్నాలను, సంస్కృతికి దర్పణం అయిన అరుదైన వస్తువులని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ దొరికిన సంగతి మనకు తెలియకుండా ఎలా మరుగున పరిచారో ఈ వార్త చూస్తే తెలిసిపోతుంది…
కళాంజలి పేరుతో భారత కళలలను, వారసత్వ సంపదని కాపాడతాం అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా 1996 లో విలువైన జాతీయ సంపదను విదేశాలకు అమ్మబోగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.. రెండు అరుదైన పెయింటింగ్స్ ను స్మగ్లింగ్ చేస్తుండగా నిలువరించి వాటిని ఢిల్లీ లోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి పంపగా, దానిపై ఎలాంటి సమాచారాన్ని బయటకి పొక్కనీయకుండా రామోజీ జాగ్రత్త పడ్డాడు. చివరికి పేరు చెప్పడానికి భయపడ్డ ఒక అధికారి ద్వారా ” వార్త” లీక్ అయింది…
ఇన్ని రోజులు ఈ విషయం పై విచారణ ఎందుకు చేపట్టలేదని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగు చూసాయి.. ఈ పెయింటింగ్స్ పట్టుకోవడానికి ఏడాదికి పూర్వమే రెండు ప్రాచీన కాలపు పంచలోహ విగ్రహాలను సదరు రామోజీ సంస్థ విదేశాలకు ఎగుమతి చేయబోతుండగా అదే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.. అసలు ఈ విషయం బయటికి పొక్కకుండా ఇన్ని రోజులు ఎలా దాచారు అని ఆరా తీయగా, ఆ రెండు విగ్రహాల స్మగ్లింగ్ ను అడ్డుకున్న నిజయితీ గల అధికారి కృష్ణారావు ని రాష్ట్ర ప్రభుత్వం తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న రామోజీ రావు ట్రాన్స్ఫర్ చేయించాడు… అని తేలింది…
ఇలా అడ్డుకున్న వారిని బదిలీ చేయిస్తూ, ఒకసారి పట్టుబడ్డా కూడా అదే విధంగా స్మగ్లింగ్ కి పాల్పడ్డారు అంటే ఆ సంస్థ ద్వారా రామోజీ ఇక ఎన్ని కళాఖండాలను దేశం దాటించి సొమ్ము చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు…
దేశ రక్షణ రహస్యాలే చైనా కి అమ్ముకున్నాడు అనే అపకీర్తి ఉన్న రామోజీ కి ఇలాంటి చిన్నా చితకా స్మగ్లింగ్ లు ఏం పెద్ద విషయం కాదు..
పత్రిక పేరుతో ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని రామోజీ చేసిన ఎన్నో నేరాల్లో ఇదొకటి…