ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమీషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కూటమి నేతలకు అనుగుణంగా వ్యహరిస్తున్నారని, ఎలక్షన్ కమిషన్ జారీ చేసే ఆదేశాలు అన్ని ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగానే ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకో పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వరుస ఫిర్యాదుల ఆధారంగా కీలక అధికారులపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై బదిలీ వేటు వేసింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి విధులు కేటాయించొద్దంటూ సి ఎస్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డిజిపి స్థానం నుంచి బదిలీ కావడంతో ఆస్థానం ఖాళీ ఏర్పడింది. ఖాళీ ఏర్పడిన ఆస్థానంలో […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీ, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ , టిడిపి వారి మీద చర్యలు తీసుకోమని సిఐడికి ఆదేశించింది. వైయస్సార్ కాంగ్రెస్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీలకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి చివరి విడత నిధులు లబ్ధిదారులకు జమ కాలేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, విద్య దీవెనలకు సంబంధించి చివరి విడత నగదు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పథకాలకు సంబంధించి లబ్ధి అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. ఈ […]
ఏపీలో ఫించన్ దారుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మగడ్డ వెనకుండి అతని చేత ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేయించిన టీడీపీ ఈ నెల ఫించన్ ను డీబీటీ రూపంలో వారి బ్యాంకు అకౌంట్ లో జమ చెయ్యమని కోరిన విషయం తెలిసిందే. టీడీపీ చేసిన సూచన మేరకు ఎన్నికల సంఘం డీబీటీ రూపంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చెయ్యండి, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటికి వెళ్లి ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని […]
2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యి, ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పైన స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయింపు పూర్తి జరిగిపోయి రిటర్నింగ్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్లో ప్రింటింగ్ కోసం పంపించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఎన్నికల్లో రెండో దశ అయిన ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. 80 సంవత్సరాలు దాటి బెడ్ కే పరిమితమైన ముసలివారికి ఇంటి నుంచే ఓటు హక్కు వేసే […]
రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికలు గుర్తు కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. గెలుపు తీరాలకు చేర్చేది ఎన్నికలు గుర్తే కాబట్టే ఆ గుర్తు విషయంలో అభ్యర్థులు ఆచి తూచి అడుగులు వేస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా అర్థం పట్టేలా ఉండే గుర్తులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమిగా పోటీ చేస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేటాయించిన గుర్తు విషయంలో […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కూటమిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత జనసేన రిజిస్టర్ పార్టీ మాత్రమే కావడంతో జనసేన గుర్తు అయిన గ్లాస్ టంబ్లర్ ను ఫ్రీ సింబల్ ఈసీ ప్రకటించింది. అంటే జనసేన పోటీ చేయబోయే 21 స్థానాలతో పాటు 154 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొదటి భాగమైన నామినేషన్ల పర్వం ఈనెల 25వ తేదీకి ముగిసింది. అభ్యర్థులు నామినేషన్లు పూర్తి అయిన తర్వాత దాఖలు చేసిన పత్రాల పరిశీలన ఉంటుంది. అలా ఎన్నికల పర్వంలో రెండో ఘట్టమైన నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న నామినేషన్ల పత్రాలు పరిశీలన పూర్తి అయినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో తెలిపారు. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు […]
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక అధికారులును విధులు నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానాలలో కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ ను ఎంపిక చేసింది. కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ కి చెందిన అధికారి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ ను ఎంపిక చేసింది. పీహెచ్డీ రామకృష్ణ 2006 బ్యాచ్ […]