ఏపీలో ఫించన్ దారుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిమ్మగడ్డ వెనకుండి అతని చేత ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేయించిన టీడీపీ ఈ నెల ఫించన్ ను డీబీటీ రూపంలో వారి బ్యాంకు అకౌంట్ లో జమ చెయ్యమని కోరిన విషయం తెలిసిందే. టీడీపీ చేసిన సూచన మేరకు ఎన్నికల సంఘం డీబీటీ రూపంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చెయ్యండి, బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటికి వెళ్లి ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 1 బ్యాంకు సెలవు కావడంతో మే 2 నుంచి ఫించన్ ఇవ్వడం మొదలు పెట్టారు . నిన్న రాష్ట్రంలోని ప్రతి చోటా వృద్ధులు వికలాంగులు వితంతువులు బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే అందరూ ఒకేసారి రావడంతో సగం చోట్ల సర్వర్ పని చెయ్యడం లేదని బ్యాంక్ అధికారులు బోర్డు లు పెట్టారు. మరి కొన్ని చోట్ల బ్యాంక్ లో డబ్బులు లేవు తిరిగి రమ్మని చెప్పి పంపించేశారు. మరి కొన్ని చోట్ల కొంత మందికి ఇచ్చి మరి కొంత మందిని తిప్పి పంపించారు. ఇలా గందరగోళ పరిస్థితుల మధ్య మొదటిరోజు గడిచిపోయింది.
తిరిగి ఈరోజు ప్రారంభమైన ఫించన్ ప్రోగ్రామ్ అదే సమస్యలతో కొనసాగుతూనే ఉంది. వృద్ధులు వికలాంగులు బ్యాంకుల చుట్టూ తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. సగం మందికి నడిచే ఓపిక లేక మెట్లు ఎక్కలేక ,ముఖ్యంగా ఈ ఎండలకు తాళలేక అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా వృద్ధుల రోదనలతో బ్యాంక్ ఆవరణలు మిన్నంటుతున్నాయి. ఈరోజు కూడా కొంత మందికి డబ్బులు అందించి మిగతా వారిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. మరి కొన్నిచోట్ల మధ్యాహ్నం నుండి ఇస్తాము అంటూ కూర్చోబెట్టారు దీనితో ఎండలకు , నీళ్లు, ఆకలికి ఇబ్బందులు పడుతూ తమ ఈ కష్టాలకు కారణం అయిన చంద్రబాబును రాయడానికి వీలు లేని భాషలో వృద్ధులు తిడుతూ కనిపించారు. తమను పలకరించిన మీడియా ప్రతినిధులతో తమ గోడును వెళ్లబోసుకుంటు తమకు వాలంటీర్ వ్యవస్థ కావాలి ఇలా బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నామంటూ తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు.