ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ టిడిపి అభ్యర్థిపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా 144 స్థానాలలో పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మొదటి విడతగా 94 మందిని, రెండో విడతలో 35 మందిని ప్రకటించింది. ఇలా ప్రకటించిన రెండు విడతల్లోనూ పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎవరి పోటీ చేస్తారనేది మాత్రం టీడీపీ ప్రకటించలేదు.ప్రస్తుతం పెనమలూరు టిడిపి ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. […]
నాకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని చంద్రబాబు మనుషుల నుంచి సమాచారం వచ్చింది. ఏం తప్పు చేశాను. సర్వేలు కూడా బాగున్నాయి. ఓడిపోయిన సమయంలో కూడా ఇంత బాధపడలేదు. పది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలేసి పార్టీ కోసం పనిచేశాను. ఇప్పుడు సీటు లేదని చెప్పడం చాలా బాధగా ఉంది’ అని పెనమలూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈయనకు టికెట్ లేదని తెలుసుకున్న అనుచరులు పార్టీ కార్యాలయం వద్ద అధిష్టానం తీరుపై ఆగ్రహం […]