నాకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని చంద్రబాబుమనుషుల నుంచి సమాచారం వచ్చింది. ఏం తప్పు చేశాను. సర్వేలు కూడా బాగున్నాయి. ఓడిపోయిన సమయంలో కూడా ఇంత బాధపడలేదు. పది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలేసి పార్టీ కోసం పనిచేశాను. ఇప్పుడు సీటు లేదని చెప్పడం చాలా బాధగా ఉంది’ అని పెనమలూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈయనకు టికెట్ లేదని తెలుసుకున్న అనుచరులు పార్టీ కార్యాలయం వద్ద అధిష్టానం తీరుపై ఆగ్రహం తెలిపారు. తమ నాయకుడికి అన్యాయం చేశారని వాపోయారు.
రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో చంద్రబాబు తీరుపై బోడే కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరు టికెట్ ఇవ్వలేకపోతున్నామని ఫోన్ చేయించారు. ఈ ప్రాంత ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిగా భావించారు. ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గంలో కష్టపడి పనిచేశాను. •ఐవీఆర్ఎస్ సర్వేలో 86 శాతం నాకే మద్దతు వచ్చింది. అసలు సీటు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు నా పేరుతో సర్వే ఎందుకు చేయించారు? సంవత్సరానికి రూ.కోటి ఖర్చు పెట్టాను. స్థానిక సంస్థల ఎన్నికలకు భారీగా ఖర్చు చేశా. లోకేశ్ పాదయాత్ర విజయవంతం ఎంత కృషి చేశానో అందరికీ తెలుసు.• పెనమలూరులో అవకాశం కల్పించలేక పోతున్నామంటే నాకు చాలా బాధగా ఉంది. చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరిని తెచ్చినా గెలిపిస్తాం. కానీ• వేరే వ్యక్తిని నిలబెడితే సహకరించేది లేదని ప్రసాద్ అన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న బోడే లాంటి సీనియర్లు కొందరికి చంద్రబాబు చెక్ పెడుతున్నారు. దీనికి రకరకాల కారణాలను చూపిస్తున్నారు. పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి వస్తోందని సాకుగా చెబుతున్నారు. బాబును నమ్ముకుని నట్టేట మునిగిపోయామని జాబితాలో పేరు లేని నేతలు ఆవేదన చెందుతున్నారు.