చిరంజీవి గొప్ప నటుడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సినిమాల్లో కంటే నిజ జీవితంలో ఇంకా అద్భుతంగా నటిస్తాడు. తన స్వార్థం కోసం నాలుకను ఎన్ని మడతలైనా పెడతాడు ఈ బాసు. తాజాగా ‘టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలి’ అని సీఎం రమేష్ను పక్కన పెట్టుకుని వీడియోలో అన్నాడు. రాజకీయాల్లో మెగా బిగ్ బ్రదర్ చేసిన విన్యాసాలు చూస్తే ఔరా అనిపించక మానదు. ఇప్పుడు ఆయన మనసు కూటమి చుట్టూ ఉండొచ్చు. కొన్నేళ్ల క్రితం వారి మీదే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.
కాంగ్రెస్లో అధికారం అనుభవిస్తున్న రోజుల్లో చిరంజీవి చంద్రబాబు, మోదీ తదితరులను చాలా మాటలే అన్నారు. ఓ సందర్భంలో ‘హిందూపురంలో ఒక ముస్లిం సోదరుడు ఇప్పటికే ఉంటే అతడిని కాదని, పక్కన పెట్టేసి ఆ సీటును తన బావమరిది బాలకృష్ణకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎంత వరకు సామాజిక న్యాయం. ఇది ముస్లింలకు చేసిన ద్రోహం కాదా. బాబు నరేంద్రమోదీతో చేతులు కలిపాక ముస్లింలను పక్కకు నెట్టడమనేది అన్యాయం’ అన్నారు చిరంజీవి.
ఇటీవల నరేంద్రమోదీని బతిమిలాడుకుని చంద్రబాబు ఎన్డీఏలో చేరాడు. చిరంజీవి ఏమో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలన్నాడు. నాడు ముస్లింల ద్రోహిగా కనిపించిన బాబు ఇప్పుడు వారి పాలిట మహాత్ముడు అయిపోయాడా బాసూ అని అభిమానులే ప్రశ్నిస్తున్నారు. హిందూపురంలో ముస్లింలకు అన్యాయం చేశాడని అన్నాడు. పోనీ ఈసారి బాబు బాలకృష్ణను తీసేసి న్యాయం చేశాడా అంటే అదీ లేదు. అప్పట్లో ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నించాడు. ఈసారి బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీట్లు ఎక్కువగా ఇచ్చేశాడా అంటే లేదు. పైగా వారికి కేటాయిస్తానని చెప్పి డబ్బు ఖర్చు పెట్టించి వీరే వాళ్లకి బీ ఫారం ఇచ్చేశాడు.
చిరంజీవికి అప్పుడేమో కూటమి నచ్చలేదు. ఇప్పుడు విపరీతంగా నచ్చేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. ఆనాడు కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి దాని కోసం మాట్లాడాడు. తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో స్వరం మార్చేశాడు. రేపు మళ్లీ కాంగ్రెస్ వచ్చిందో నేరుగా హస్తినకు వెళ్లి సోనియా గాంధీకి ఒంగి ఒంగి దండం పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మెగా బ్రదర్స్తో అంత వీజీ కాదు. ఈ దిక్కున ఉన్నారని చూసే లోగా.. ఇంకో దిక్కున వేరే వారితో ఉంటారు. పోనీ అక్కడ ఎక్కువ సేపు ఉండరు. ఇంకోరి చంకనెక్కేస్తారు.