ఐపీఎల్ 2024లో భాగంగా చండీఘర్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు , తరువాత వచ్చిన మార్కరమ్ పరుగులు ఏమి చేయకుండా వెంటనే వెనుదిరగడం , సబ్ స్ట్యూట్ ప్లేయర్ గా వచ్చిన త్రిపాఠీ కూడా రాణించలేకపోవడంతో ఒక దశలో హైదరాబాద్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలుగుతుందా అనే సంథిగ్ధత నెలకొంది
కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మన వైజాగ్ ఆటగాడు నితీశ్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ తో హైదరాబాద్ 182 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది , నితీష్ కి తోడు అబ్ధుల్ సమాద్ కూడా బ్యాటింగ్ లో రాణించారు. నితీష్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులు ( 5 సిక్స్ లు , 4 ఫోర్లు ) సమద్ 12 బంతుల్లో 25 పరుగులు చేసారు
పంజాబ్ బౌలర్లు హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసుకోగా హర్షల్ పటేల్ , సామ్ కరన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా రబాడా 1 వికెట్ తీసుకున్నాడు.
183 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది భువనేశ్వర్ కుమార్ , కమ్మిన్స్ బౌలింగ్ దాటికీ పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో గెలుపు కోసం పోరు రసవత్తరంగా మారింది , చివర వరకు ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో ఎట్టకేలకు హైదరాబాద్ టీం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది . పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు180 పరుగులు మాత్రమే చేయగలిగింది, పంజాబ్ బ్యాటర్లలో శాశంక్ 46 పరుగులు , సికిందర్ 28 పరుగులు , సామ్ కర్రన్ 29 పరుగులు అశుతోష్ శర్మ 33 పరుగులు చేసారు
హైదరాబాద్ బౌలర్లలో భువి 2 వికెట్లు , కమ్మిన్స్ , నటరాజన్ , జయదేవ్ , నితీశ్ తలో వికెట్ తీసుకున్నారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నీతీష్ రెడ్డికి అవార్డ్ లభించింది