ఐపీఎల్ లో 2024లో భాగంగా నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గుజరాత్, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది..
ఐపీఎల్ లో 2024లో భాగంగా నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గుజరాత్, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలను నిలబెట్టుకోగలిగింది. మరో వైపు గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ ఆర్సీబీ బౌలింగ్ ధాటికి పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 23 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్ లో పవర్ ప్లే లో ఇదే అతి స్వల్ప స్కోర్ కావడం విశేషం .. షారూఖ్ ఖాన్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా 35 పరుగులు, డేవిడ్ మిల్లర్ 30 పరుగులు లు చేసారు , ఈ బ్యాటర్లు తప్ప మిగిలిన ఎవరు పెద్దగా రాణించలేకపోవడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి గుజరాత్ ఆలౌట్ అయ్యింది.
ఆర్సీబీ తరఫున మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయకుమార్ వైశాఖ్ తలో 2 వికెట్లు తీశారు. కెమరూన్ గ్రీన్, కర్ణ్ శర్మ తలా 1 వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ గట్టి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ అద్భుతంగా, దూకుడుగా బ్యాటింగ్ చేసారు. డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డు ప్లెసిస్ 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అయితే ఫాఫ్ ఔటైన తర్వాత ఆర్సీబీ పతనమైంది. ఆర్సీబీ కేవలం 25 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. విల్ జాక్స్ 1, రజత్ పాటిదార్ 2, గ్లెన్ మాక్స్వెల్ 4 మరియు కామెరాన్ గ్రీన్ 1 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఒక దశలో ఆర్సీబీకి ఓటమి తప్పదనే అనుకున్నా దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ లు ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. దినేష్ కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్వప్నిల్ సింగ్ 15 పరుగులు చేశాడు. గుజరాత్ తరఫున జాషువా లిటిల్ ఒక్కడే 4 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మహ్మద్ సిరాజ్ ఎంపిక అయ్యాడు