ఐపీఎల్ 2024 సీజన్ లో సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకోగా ముంబాయి హ్యాట్రిక్ ఓటములను మూట కట్టుకుంది
టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబాయి ఇండియన్స్ టాప్ ఆర్డర్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయింది, పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది , న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హిట్ మ్యాన్ సహా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డెక్ ( పరుగులు ఏమీ చేయకుండా ) గా పెవిలియన్ కి చేరారు
ముంబాయి కెప్టెన్ పాండ్యా , మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసారు కానీ స్పిన్నర్ చాహాల్ కి బౌలింగ్ లో అవుటయ్యారు, తిలక్ వర్మ 32 పరుగులు , పాండ్యా 34 పరుగులు చేసారు
ముంబాయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగారు
రాజస్థాన్ బౌలర్లలో బోల్ట్ ,చాహల్ చెరో మూడు వికెట్లు తీసుకోగా బర్గర్ 2 వికెట్లు , ఆవేశ్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు
రాజస్థాన్ లక్ష్యం చిన్నది కావడంతో పెద్దగా ఒత్తిడికి లోనవకుండానే లక్ష్యాన్ని ఛేదించారు, రియాన్ పరాగ్ మరోసారి తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు, 39 బంతుల్లో 54 పరుగులు ( 5 ఫోర్లు , 3 సిక్స్ లు ) చేసి అజేయంగా నిలిచాడు .. దీంతో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుని పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది
ముంబాయి బౌలర్లలో ఆకాశ్ 3 వికెట్లు , మఫాకా 1 వికెట్ తీసుకున్నారు
అద్భుతమైన బౌలింగ్ తో ముంబాయి టాప్ ఆర్డర్ ను పెవిలియన్ కు పంపిన బౌల్ట్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది