ఐపీఎల్ 2024 నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది.
గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులు ( 6 ఫోర్లు, 4 సిక్స్ లు ) లతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి అజేయంగా నిలాచాడు, గిల్ కి తోడు గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు 19 బంతుల్లో 33 పరుగులు చేసి వెనుదిరగక, మరో బ్యాటర్ రాహుల్ తివాటియా చివర్లో బ్యాట్ రుళిపించాడు, కేవలం 8 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ సీజన్ లో ఈ మ్యాచ్ ద్వారా ప్లెయింగ్ ఎలెవన్ లో చోటు సంపాదించుకున్న విలియమ్ సన్ 22 పరుగులు మాత్రమే చేసాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు పెద్దగా రాణించ లేకపోయారు. రబడా రెండు వికెట్లు , హర్షల్ పటేల్ , హరప్రీత్ చెరో వికెట్ తీసుకున్నారు.
200 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే కెప్టెన్ శిఖర్ దావన్ వికెట్ కోల్పోయింది ఇంకో ఎండ్ లో ఉన్న బెయిరిస్టో కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు .. పవర్ ప్లే తర్వాత వెంట వెంటనే వికెట్లు పడటంతో టాప్ ఆర్డర్ విఫలమైందనే చెప్పాలి.
కానీ మిడిల్ ఆర్డర్ యువ ఆటగాళ్లు ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఒత్తిడి తట్టుకుని అద్భుతంగా రాణించారు కష్టతరమనుకున్న లక్ష్యాన్ని జయించారు.
శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 పరుగులు ( 6 ఫోర్లు , 4 సిక్స్ లు ) లతో అజేయంగా నిలిచి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు, వన్ డౌన్ ప్రభుస్మన్ సింగ్ 35 పరుగులు చేయగా, చివర్లో వచ్చిన అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులు చేసాడు, పంజాబ్ యువ ఆటగాళ్లు వాళ్ల శక్తికి మించి కృషిచేయడంతో 19.5 ఓవర్లలో మూడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది
గుజరాత్ బౌలరల్లో నూర్ అహ్మాద్ 2 వికెట్లు తీసుకోగా మిగితా బౌలర్లు తలో వికెట్ తీసుకున్నారు, పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన శశాంక్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.