ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు కెఎల్ రాహుల్ , డికాక్ శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరూ తొలి వికెట్కు 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. కెఎల్ రాహుల్ మొదటి వికెట్ గా వెనుదిరిగాక డికాక్ 5 ఫోర్లు, 2 సిక్సులతో 38 బంతుల్లోనే 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు
అనంతరం కెప్టెన్ పూరన్ క్రీజులోకి వచ్చాడు.. పూరన్ తన దైన శైలిలో ఆడుతూ జట్టు స్కోర్ ను ముందుకు తీసుకుని వెళ్లాడు. 21 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా కూడా దూకుడుగా ఆడాడు 22 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్ లతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు చేసింది, పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లు, అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు, రాహుల్ చాహర్, రబాడ తలో వికెట్ తీశారు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో ధాటిగా ప్రారంభించారు. మొదటి 10 ఓవర్లలోనే 98 రన్స్ చేసి గెలుపు దిశగా ప్రయాణం చేసారు కానీ ఆరంగ్రేటం మ్యాచ్ లోనే అధ్బుతమైన బౌలింగ్ తో ఇండియన్ యువ పేసర్ మయాంక్ యాదవ్ వీళ్ల జోడికి బ్రేక్ ఇచ్చాడు
జానీ బెయిర్స్టో 29 బంతుల్లో 42 పరుగులు ( 3 ఫోర్లు , 3 సిక్స్ లు ) చేసి వెనుదిరిగాడు తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరు నిలదొక్కుకునే ప్రయత్నమే చేయలేదు , వెంట వెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. ఇంకో పక్క పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది ధావన్ 50 బంతుల్లో 70 పరుగులు ( 7 ఫోర్లు , 3 సిక్స్ లు ) చేసి అవుటయ్యాడు, చివర్లో వచ్చిన లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 28 పరుగులు కాసేపు మెరుపులు ( 2 ఫోర్లు 2 సిక్స్ లు ) మెరిపించిన అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరపగులు మాత్రమే చేయగలిగింది
దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి గెలుపును సాధించింది, లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 27 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడంతో పంజాబ్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి, మరో బౌలర్ మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఆరంగేట్రం మ్యాచ్ లోనే అద్భుత బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.