ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 .. బెంగళూరు వేదికగారాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ అధ్బుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది
కింగ్ కోహ్లీ దూకుడు గా ఆటను ప్రారంభించినా ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్ బ్యాటింగ్ లో మరోసారి ఫెయిల్ అయ్యాడు , తరువాత వచ్చిన ఆసిస్ ఆటగాడు గ్రీన్ సహాయంతో కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకుని వెళ్లాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆ జట్టు 60 పరుగులు చేసింది , బ్యాటింగ్ కు పిచ్ సహకారం లభించనప్పటికీ విరాట్ తనదైన మార్క్ బ్యాటింగ్ తో 59 బంతుల్లో 83 పరుగులు ( 4 ఫోర్లు , 4 సిక్స్ లు ) చేసి అజేయంగా నిలిచాడు గ్రీన్ 21 బంతుల్లో 33 పరుగులు, మాక్స్ వెల్ 19 బంతుల్లో 28 , చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ 8 బంతుల్లో 20 పరుగులు చేసారు.కేకేఆర్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఆర్సీబీని 200 పరుగుల లోపే నిలువరించడంలో సఫలమైంది, రస్సల్ , హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీసుకోగా సునీల్ నార్నే 1 వికెట్ తీసుకున్నాడు
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓపెనర్లు చెలరేగిపోయారు, ఓవర్ సీస్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ , సునీల్ నార్నే ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ బౌండరీల వర్షం కురిపించడంతో ఆ జట్టు పవర్ ప్లే లోనే 85 పరుగులు చేసి సునాయాస గెలుపుకు పునాది వేసారు
సునీల్ నార్నే 22 బంతుల్లో 47 పరుగులు ( 5 సిక్స్ లు , 4 ఫోర్లు ) ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 30 రన్స్ ( 2 ఫోర్లు , 2 సిక్స్ లు) చేసి వెనుదిరిగారు , వెంకటేశ్ అయ్యార్ 30 బంతుల్లో 4 సిక్స్ లు , 3 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు .. శ్రేయస్ అయ్యార్ 24 బంతుల్లో 39 రన్స్ చేయడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆర్సీబీకి కోహ్లీ ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది,ఆర్సీబీ బౌలర్లలో మయాంక్ , విజయ్ కుమార్ , యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కేకేఆర్ ఆలౌండర్ సునీల్ నర్నేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది