మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ వెనువెంటనే ఆర్సీ 17 ను కూడా ప్రకటించడం విశేషం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విభిన్న చిత్రాలను రూపొందించే సుకుమార్ తో మరోసారి రామ్ చరణ్ పని చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ మూవీని హొలీ సందర్భంగా ప్రకటించడం విశేషం.
కాగా గతంలో రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సంచలన విజయం సాధించింది. రామ్ చరణ్ లో ఉన్న నటుడిని పూర్తి స్థాయిలో వాడుకున్న దర్శకుడిగా సుకుమార్ పేరు సంపాదించుకున్నారు. రంగస్థలం చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం. మరోసారి అదే కాంబో కలిసి పనిచేయనుండడంతో రామ్ చరణ్ 17వ చిత్రంపై అంచనాలు ఏర్పడుతున్నాయి.
తాజాగా రామ్ చరణ్ తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. కానీ శంకర్ రూపొందించిన గత కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో ఆయన గేమ్ ఛేంజర్ తో తిరిగి హిట్ అందుకుంటున్నారనే ధీమాతో ఉన్నారు. కాగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్నారు.