ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరల్ అమలు భేష్ - జాంబియా దేశ విద్యా రంగ ప్రతినిధులు
విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన దేశంలో ఒక మోడల్ గా తయారు చేశాడు. నిన్న మొన్నటి వరకు పక్క రాష్ట్రాల అధికారులు, కేంద్ర ఆధ్వర్యంలో పని చేసే పలు సంస్థల నుండి అనేక మంది అధికారులు ఎలా అమలు పరుస్తున్నారు అని పరిశీలించడానికి మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు.నేడు అది రాష్ట్ర స్థాయి దాటి వివిధ దేశాలు నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలించి, వాళ్ల దేశంలో ఎలా అమలు పరచాలి అనే సలహాలు మన రాష్ట్ర స్థాయి అధికారులను అడిగే స్థాయి మనం ఎదిగాం అంటే ఎంతో గర్వకారణం.
ప్రస్తుత విషయానికి వస్తే జాంబియా దేశ విద్యా రంగ ప్రతినిధుల బృందం మన రాష్ట్రానికి విచ్చేసింది. వాళ్ళ పర్యటనలో భాగంగా బాపట్ల జిల్లాలోని వివిధ పాఠశాలను వివిధ బృందాలుగా ఏర్పడి సందర్శించారు.అందులో భాగంగా మరుప్రోలువారిపాలెం మండల పరిషత్ పాఠశాలలోని విద్యార్థులు తరల్ అమలులో భాగంగా వెల్కమ్ సాంగ్ నృత్య ప్రదర్శన, కాకి- ఎలుగుబంటి లఘునాటికలను ప్రదర్శించగా వాటిని చూసిన ప్రతినిధుల బృందం విద్యార్థులను అభినందించారు. తర్వాత పేరెంట్స్ కమిటీతో ప్రతినిధులు బృందం మాట్లాడుతూ పిల్లల అభివృధిలో తల్లితండ్రుల పాత్రల గురించి తెలుసుకున్నారు. అనంతరం బాపట్లలోని స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ద్వారా నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులతో మాట్లాడుతూ జాంబియా దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని తెలిపారు. బాపట్ల జిల్లాలో వివిధ పాఠశాలను సందర్శించి మన బడి నాడు-నేడు, జగనన్న గోరుముద్ద , పేరెంట్స్ టీచర్స్ కమిటీ, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్లు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, విద్యార్థులకు కిట్ ఇలా విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు చూసి ప్రశంసించారు.ఇలాంటి కార్యక్రమాలు తమ దేశంలో కూడా అమలు చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా చేపడుతున్న కార్యక్రమాలను వివరించి వచ్చిన బృందాన్ని సత్కరించారు.ఈ బృందంలో ప్రాథమిక విద్య డైరెక్టర్ కెల్లీ కేజాలా మ్వాలే, హజెంబా (తరల్ ఆఫ్రికా, వీవీ వోబి సంస్థ మధ్య ప్రభుత్వ లైజన్ ఆఫీసర్), టీచర్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజ్డ్ సర్వీ సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆంటోని టంబాటంబా, కంట్రీ ప్రొగ్రామ్స్ మేనేజర్ కరోలిన్ మేరీ ఇలియట్, ప్రథమ్ ప్రతినిథులు పి.రాంబాబు, జి.వినోద్ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.