మేనిఫెస్టో.. తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఫలానా కార్యక్రమాలు చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టిలో ఇది చిత్తు కాగితం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రం భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం.
2014లో టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. ఆ సమయంలో 600కు పైగా హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో కూడిన పత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. ప్రజలను మోసం చేసి అధికారం తీసుకోవడమే తరువాయి బాబు తన పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను తీసేయించారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు.
2019లో జగన్ తన మేనిఫెస్టోను ప్రకటించారు. సీఎం అయ్యాక తూచా తప్పకుండా పాటించారు. ప్రతి వర్గానికి సంక్షేమం అందించారు. కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అండగా నిలిచారు. బహుశా దేశ చరిత్రలో ఇలా చేయడం మొదటిసారని చెప్పొచ్చు. జన్మభూమి కమిటీల్లాంటివి పెట్టకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పథకాల సొమ్ము చేరేలా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను కరోనా అడ్డంకులను దాటుకుని 99 శాతం మేర అమలు చేశారు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన ఎలాంటి మేనిఫెస్టో ప్రవేశపెడతారా అని రాష్ట్ర ప్రజానీకంలో ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ తీసుకొచ్చిన సూపర్ సిక్క్ పథకాలను ఇక్కడ ప్రకటించారు. 30వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కానీ ఈయనపై ఎవరికీ నమ్మకం లేదు. మోసం చేయడంలో దిట్ట కాబట్టి ఏదో నోటికొచ్చింది చెప్పేస్తాడులే అని భావిస్తున్నారు.
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విడుదల చేశారు. దీనికి జగనన్న నవరత్నాలు ప్లస్గా నామకరణం చేశారు. చేయగలిగినవి మాత్రమే చెప్పారు. పాలనా అనుభవంతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకున్నారు.