ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనే దానిపై స్పష్టత వచ్చింది. మే 13న న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. కాగా ఇప్పుడు అందరి దృష్టి వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపైనే విడుదలపైనే కేంద్రీకృతమైంది. ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన నేతగా విశ్వసనీయతను సంపాదించుకున్న సీఎం జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ సాధారణ ప్రజల్లో నెలకొంది.
2014 ఎన్నికల్లో 600కు పైగా మేనిఫెస్టో ద్వారా హామీలిచ్చిన చంద్రబాబు ఆ హామీలను అమలుచేయకుండా ఐదేళ్లపాటు కాలం గడిపారు. ప్రజలు ఎక్కడ హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తారో అన్న భయంతో మేనిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుండి మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. అనంతరం డ్వాక్రా రుణమాఫీ విషయంలో అసెంబ్లీ సాక్షిగా మహిళలను మోసం చేసి ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాడు.
కానీ సీఎం జగన్ మాత్రం నవరత్నాలను హామీలుగా మేనిఫెస్టోలో పెట్టి, భగవద్గీత, ఖురాన్, బైబిల్తో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను పోల్చి అందులో ఇచ్చిన హామీలన్నింటిని దాదాపుగా అమలు చేసి ఇప్పుడు గత మేనిఫెస్టోకంటే మిన్నగా ఉన్న మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మేనిఫెస్టో రూపకల్పన ఇప్పటికే తుది దశకు చేరుకుందని సమాచారం. కాగా మేనిఫెస్టోను బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభ వేదికగా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అక్కడ మేనిఫెస్టోపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగానే మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తుంది.
గత మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్ ఈసారి పేదలకు మాత్రమే కాకుండా మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలతో నవరత్నాలను మించిన పథకాలను మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో వుంటుందని ఈ మేనిఫెస్టో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుబులు రేపడం ఖాయమని తెలుస్తుంది. జగన్ హామీ ఇస్తే తప్పకుండా అమలుచేస్తాడనే విశ్వసనీయతను సంపాదించుకున్న నేపథ్యంలో మేనిఫెస్టో విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.