నాడు విద్య ప్రభుత్వ భాద్యత కాదన్న చంద్రబాబు ప్రైవేట్ మోజులో పడి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. 2019 నుంచి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగటానికి, డ్రాపవుట్స్ ఆపటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి మనబడి నాడు – నేడు పథకం. దీని వల్ల పాఠశాలల రూపురేఖలు మారాయన్నది అక్షరాల నిజం. బాబు హయాంలో పెచ్చులూడిన స్లాబులు, నెర్రలు బారిన గోడలు దర్శనమిచ్చేవి. విరిగిపోయిన బెంచీల నడుమ కటిక నేలపై కూర్చొని చదువుకోవాల్సి వచ్చేది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండేవి. చాలాచోట్ల మచ్చుకైనా కనిపించేవి కాదు. ఎక్కడో ఒకచోట మాత్రమే టీవీలు ఉండేవి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న మాటకి తగ్గట్టే బాబు వ్యవహరించాడు.
అదే జగన్ హయాంలో నాడు – నేడు కింద తొలిదశలో ప్రభుత్వం రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,000 బడుల్లో పనులు చేపట్టింది.
ఈ అభివృద్ధి పనుల్లో ఆయా స్కూల్స్ లో చదివే పిల్లల పేరెంట్స్ తో కమిటీలు వేసి వారి ఆధ్వర్యంలోనే కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ స్కూల్స్ కోసం నూతన భవనాలు కట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా వివిధ సబ్జెక్టుల పెయింటింగ్స్ వేయించారు. సైన్స్ ల్యాబ్లు పెట్టారు. సరికొత్త డెస్క్లు వచ్చాయి. కుర్చీలు సమకూర్చారు. కొత్త మరుగుదొడ్లు కట్టించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు పెట్టారు. అదనపు తరగతి గదులు నిర్మితమయ్యాయి. మధ్యాహ్న భోజన పథకం కోసం వంట గదులు కట్టారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. బడులకు ప్రహరీలు నిర్మించారు. డిజిటల్ క్లాస్ల బోధనకు వీలుగా పరికరాలు సమకూర్చారు. ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు.
నాడు – నేడు కింద తొలిదశలో ప్రభుత్వం రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. తర్వాత రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,000 బడుల్లో పనులు చేపట్టింది.