ప్రజలను ఏమార్చడంలో ఎల్లో మీడియాది అందె వేసిన చేయి. జరిగిన సంఘటన ఇంకోటైతే వేరేది చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీరియస్ అయ్యారని ఓ ఎల్లో ఛానల్లో డిబేట్ పెట్టి నవ్వులపాలయ్యారు. ఎన్నికల మీటింగ్కు వస్తే ఇదెప్పుడు జరిగిందా అని మూడు పార్టీల శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.
ప్రజాగళం సభకు ప్రధాని మోదీ వచ్చారు. తక్కువ సమయమే ఉన్నారు. ఈ గ్యాప్లోనే చంద్రబాబు తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శించారు. పీఎం పక్కన కూర్చొని పదుల సార్లు నమస్కారాలు పెట్టారు. గతంలోని తిట్లను నేడు పొగడ్తలుగా మార్చి తన మీద దయ చూపండనే ధోరణిలో మాట్లాడారు. మోదీ కాసేపు ప్రసంగించారు. అందులోనూ మైక్ పనిచేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ ఎల్లో మీడియా కట్టు కథలు అల్లేసింది.
ఓ టీవీ ఛానల్లో కరుడుగట్టిన ఎల్లో యాంకర్ మోడీతో బాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. బాబు అరెస్ట్పై పీఎం సీరియస్ అని హెడ్డింగ్ పెట్టి డిబేట్ చేశారు. మోదీ తన ప్రసంగంలో ఎక్కడా టీడీపీ అధినేత అరెస్ట్ గురించి ప్రస్తావించలేదు. ఎన్డీఏ సాధించిన విజయాలను చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు తెలుగు తమ్ముళ్లు ప్రధాని స్పందించాలని ఆయన్ను నోటికొచ్చింది అన్నారు. కానీ ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చని భావించారేమో.. అయితే ఆ విషయాలను ప్రస్తావించకపోవడంతో అసంతృప్తికి లోనైన పచ్చ మీడియా తమకు తాముగా ఏదో ఊహించుకుని డిబేట్లు నడిపింది.
ఇక ఆంధ్రజ్యోతి అలియాస్ చంద్రజ్యోతి స్టైల్ వేరు. బాబు, ప్రధాని ఆప్యాయంగా మాట్లాడుకున్నారంటూ కథ రాసుకొచ్చింది. ‘మీరు చాలా గట్టిగా మాట్లాడారు. అంత గట్టిగా మాట్లాడితే మాకైతే గొంతు నొప్పి వస్తుంది. మీది చాలా గట్టి స్వరం’ అని పీఎం అన్నారట. దానికి బదులుగా టీడీపీ అధినేత స్పందించి నమస్కారం పెట్టి ’అలా అలవాటు పడ్డానని, అలా మాట్లాడకపోతే సభలో ఊపు రాదు’ అని చెప్పారట. మైకుల గోలలో ఈ విషయం మీడియాకు ఎలా తెలిసిందని తెలుగు తమ్ముళ్లు నోరెళ్లబెడుతున్నారు. అసలు బాబు రొటీన్ ప్రసంగం వినలేక చాలామంది నేతలే సభలకు రారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు వస్తున్నాయి.
పాపం ఎల్లో గ్యాంగ్.. చంద్రబాబు తిట్టమంటే తిట్టాలి. పొగడమంటే పొగడాలి. వాళ్లు ఏ స్క్రిప్ట్ పంపితే అది చదవాలి. జనం నవ్వుకుంటున్నారనే ఆలోచన కూడా చేయడం లేదు.