పిఠపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటి చేస్తున్న అని ప్రకటించిన తరువాత టీడీపీ కార్యకర్తలు, నాయకుల నుండీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ని పిలిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి సహకరించమని కోరిన పిమ్మట అతను అన్యమనస్కంగానే ఒప్పుకోంటూ పవన్ కాకుండా మరొకరు అయితే ఒప్పుకోను అని తెగేసి చెప్పినట్టు సమాచారం .
ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం పై స్పెషల్ ఫోకస్ చేసింది వైసీపీ అధిష్టానం . ఇప్పటికే పిఠపురం నియోజకవర్గ ఇంచార్జ్ గా వంగా గీత కి అవకాశం ఇచ్చిన జగన్ , పిఠాపురం నియోజకవర్గ ఇతర పార్టీల కీలక నాయకుల మీద దృష్టి సారించారు. గత రెండు రోజులుగా జనసేన కు చెందిన పలువురు కీలక నాయకులు , కార్యకర్తలు జనసేన ను వీడి వైసీపీ లోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక 2019 లో జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసిన శేషుకుమారి జనసేనలో జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక జనసేనకు రాజీనామా చేసి సిఎం జగన్ సమక్షం లో వైసీపీ జాయిన్ అవుతున్నారు
ఈ తరుణంలో సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీస్లో పిఠాపురం పై రివ్యూ మీటింగ్ పెడుతూ పిఠాపురం కీలక నేతలైన వంగగీత , ముద్రగడ లను మీటింగ్ కు రామ్మని పిలిచారు . అదే టైమ్ లో పార్టీ సీనియర్ నాయకులు అయిన కన్నబాబు , దాడిశెట్టి రాజా , ద్వారంపూడి , మిథున్ లకు మండలాల వారిగా కీలక బాధ్యతలు అప్పగించి స్పెషల్ ఫోకస్ పెట్టమని ఆదేశించారు . గొల్లప్రోలుకు కన్నబాబును , యూ. కొత్తపల్లి దాడిశెట్టి రాజా ను , పిఠపురం టౌన్ కు మిథున్ లను ఇంచార్జ్ లుగా నియమించారు . పిఠపురం టోటల్ ఇంచార్జ్ గా ముద్రగడ పద్మనాభం కు భాద్యతలు అప్పగించారు.