2024 సార్వత్రిక ఎన్నికలకు 40 రోజులు సమయం కూడా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల పొత్తులు ఇంకా ఒక తాటి పైకి రాలేదు. ఇప్పటికే టిడిపి జనసేన పొత్తు ఖరారు అయినప్పటికీ, బిజెపితో ఇంకా పొత్తు ఖరారు కాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనానీ అందరూ ఊహించినట్టే టిడిపితో జత కట్టాడు. ఒకవైపు బిజెపితో ఉంటున్నట్లు నటిస్తూనే టిడిపితో జత కట్టేసి 2024 ఎన్నికలకు 24 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. టిడిపి బిజెపితో పొత్తు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నప్పటికీ ఇంకా ఏ విషయం ఒక కొలిక్కి రాలేదు.
ఫిబ్రవరి నెలలోనే పొత్తులపై చర్చలు అంటూ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసిన చంద్రబాబు ఎటువంటి సమాచారం లేకుండానే వెనుతిరిగాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అమిత్ షా ను కలిసిన తర్వాత రెండుసార్లు అపాయింట్మెంట్ ఉందంటూ ఆంధ్రాలో ఎటువంటి పర్యటనలు చేయకుండా హైదరాబాద్ ఫామ్ హౌస్ కే పరిమితమైన విషయం తెలిసిందే, ఆ రెండు మూడు సార్లు అపాయింట్మెంట్లో ఒకసారి కూడా ఢిల్లీకి వెళ్లి కలిసిన దాఖలాలు లేవు. మరోవైపు ఆంధ్రాలో బిజెపి పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కసరత్తులు చేసుకుంటున్న తరుణంలో టిడిపి జనసేన కూటమి ఢిల్లీ వెళ్లడంతో అమిత్ షా నడ్డాలతో మీటింగ్ కు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎట్టకేలకు నిన్న చంద్రబాబు హైదరాబాదు నుంచి పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా నడ్డాలతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మీడియాతో మాట్లాడానికి ఇష్టపడలేదు అంటే పొత్తు ఇంకా కొలిక్కి రాలేదా? పొత్తు కొలిక్కి వచ్చిన సీట్లు సర్దుబాటు జరగలేదా. మరోవైపు సమాచారం ఏంటంటే తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందే అంటున్న బిజెపి అగ్ర నేతలు, గతంలో మోదీపై వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట్లు వినికిడి. ఈ భేటీలో ముఖ్యంగా బిజెపి అగ్రనేతలు తమకు 8 నుంచి 10 లోకసభ స్థానాలు 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకి ఓకే అంటున్నట్లు సమాచారం. ఇంకా పొత్తుపై అధికారిక ప్రకటన రానప్పటికీ సీట్ల సర్దుబాటుపై టిడిపి జనసేనలు బిజెపి అడిగిన సీట్లు ఇవ్వడానికి తయ్యారు అవుతున్నట్లు తెలుస్తోంది.