ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అన్ని పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి . అధికార పార్టీ వైసీపీ నాయకులు , కార్యకర్తలు ప్రజల మధ్య కు వెళ్లి ఈ అయిదు సంవత్సరాల్లో తమ పార్టీ పవిత్ర గ్రంధం గా ప్రకటించిన మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీల్లో 99% పూర్తీ చేసాము, అలాగే జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ది చూసి ఓటు వెయ్యమని అడుగుతున్నారు.
నాడు నేడు కింద అభివృధి చెందిన పాఠశాలలు, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, 17 మెడికల్ కాలేజీ లు , 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ లు గురించి వివరిస్తూ ఇచ్చిన 6 లక్షల ఉద్యోగాలు గురించి ఇంటింటికి చెబుతూ అలాగే 2023 జూన్ వరకూ లక్ష కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం లో గ్రౌండ్ అయినాయి . ఉద్ధనం కు మంచి నీరు, కిడ్నీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చెయ్యడం, వెలుగొండ పూర్తీ చెయ్యడం. కరోనా టైమ్ లో రాష్ట్ర ప్రజలను కాపాడుకున్న వైనం, చేసిన సేవ ను గుర్తు చేస్తూ, ఇటు ప్రజలకు చేసిన సంక్షేమం అటు అభివృధి నీ ప్రజలకూ వివారిస్తు ఇంటింటికి తిరిగి ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు.
ఇదే టైం లో ప్రతిపక్ష నేతలకు పార్టీలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రధానంగా ఒక ప్రశ్నను సంధిస్తున్నారు. 2019 నుండి 2023 వరకు మేము చేసిన అభివృద్ది ఇది , మా మ్యానిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చాము . చెప్పని ఎన్నో పనులను పూర్తీ చేసాము
మరీ టీడీపీ, జన సేన, బిజెపి కూటమి 2014 -2019 వరకు తమ డబుల్ ఇంజన్ సర్కార్ లో చేసిన అభివృధి ఏమిటీ? అసలు మీ మ్యానిఫెస్టోలో ప్రకటించినా 600 హమిలల్లో ఒక్కటైన పూర్తీ చేశారా అంటూ వైసీపీ నాయకులు కార్యకర్తల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు అ పరిపాలన కాలంలో ప్రజలకూ ఇది చేసాము అని చెప్పుకునే దమ్మూ ధైర్యం వున్నాయా అని ప్రశ్నిస్తున్నాయి వైసీపీ శ్రేణులు .
దీనికి, టీడీపీ బిజెపి, జనసేన కూటమి ఏమి సమాధానం చెబుతుందో వేచి చూడాలి.