తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెనలు రద్దు చేస్తామని లోకేష్ ప్రకటించడం లో ఆంతర్యం ఏమిటి? ఈ రెండూ విద్యార్థులకి, వారి తల్లి తండ్రులకి ఎంతో ఉపయోగపడే పథకాలు, వారి ప్రశంసలు అందుకుంటున్న పథకాలే.. సాధారణంగా జనాలకి నచ్చిన, ఉపయోగపడే స్కీమ్స్ ని రద్దు చేస్తామని చెప్పే సాహసం అసలు చేయరు. అయినా లోకేష్ చెప్పడం ఒక అవివేకమైన స్టేట్మెంట్ అని అందరూ అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది..
ప్రజలకు మేలు చేస్తుంది అంటే దాని మీద వ్యాపారం చేస్తున్న వారికి నష్టమనే అర్థం. విద్యా దీవెన గానీ వసతి దీవెన గానీ విద్యార్థి యొక్క అకౌంట్ లో నేరుగా జమ చేస్తున్నారు, దానిని వారు కాలేజీ యాజమాన్యానికి చెల్లించాలి. ఇంతకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యానికి నేరుగా చెల్లించేవారు.. దీనిని తమకి అనుకూలంగా మార్చుకుని బాబు ప్రభుత్వం తమ అనుకూలురైన కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కయి వారి స్టాండర్డ్ తక్కువ అయినా యూజీసీ వారి ప్రమాణాలకు దూరం గా ఉన్న కాలేజీ లకు కూడా అధిక ఫీజులు నిర్ణయించి వాటిని ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేసేవి. బదులుగా వారు టీడీపీ ఎన్నికల ఖర్చు భరించేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆ పప్పులు ఉడకడం లేదు, నాణ్యతా ప్రమాణాలు, బోధనా స్థాయిని బట్టి ఫీజులని నిర్ణయించి వారి స్టాండర్డ్ ని బట్టే ఫీజులు నిర్ణయించి వాటిని నేరుగా విద్యార్థి తల్లితండ్రుల అకౌంట్లో జమ చేయడం వాటిని కాలేజీ యాజమాన్యానికి విద్యార్థుల తల్లితండ్రులు చెల్లించడం తో తాము ఫీజు చెల్లిస్తున్నామనే భావన తల్లితండ్రులలో కలిగి వారు విద్యా ప్రమాణాలపై, స్టూడెంట్ అటెండెన్స్ పై కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతున్నారు. ఈ భాద్యతాయుత నిర్వహణ, అధిక ఫీజుల నుండి నివారణ, కాలేజీ యాజమాన్యాలకు కంటకింపుగా, భారంగా మారింది.
అందుకే కాలేజీ యాజమాన్యాల ప్రాపకం కోసం లోకేష్ ధైర్యం గా అవి రద్దు చేసేస్తానని బహిరంగంగా చెప్పాడు.. ఎందుకనగా 2014 లో నారాయణ టీడీపీ కోసం ఎన్నికలలో 400 కోట్లు ఖర్చు చేశాడనేది రాజకీయ వర్గాల్లో అందరికీ తెల్సిన విషయమే, అందుకే ఎన్నడూ సర్పంచ్ గా కూడా అనుభవం లేని ఆయనకి అతిముఖ్యమైన మున్సిపల్ శాఖ కేటాయించారు కూడా. 2024 లో కూడా టీడీపీ కి ఇలాంటి నారాయణలు చాలా మంది అవసరం పడతారని లోకేష్ కి బాగా తెలుసు. దీనికోసమే ఆ బోల్డ్ స్టేట్మెంట్.
ఉదాహరణకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ ని వీడటానికి టికెట్ విషయం కారణం అనీ అందరూ భావిస్తున్నారు కానీ అది కొంతవరకు నిజం అవ్వచ్చు, అలాగే నరసరావు పేట అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపిస్తున్నారు అది పూర్తిగా అవాస్తవం. ఈ ఐదేళ్లలోనే పేట కి రెండు మున్సిపాలిటీ లు, ఒక JNTU, మెడికల్ కాలేజీతో పాటు వరికపుడిసెల ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగింది. అభివృద్ధి జరగలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమే.. అసలు కారణం మాత్రం లోకేష్ ఇచ్చిన మాట వలన టీడీపీ కి అనుకూలంగా గా మారాడు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఐదేళ్లలో దాదాపు 120 కోట్లు నష్టపోయానని ( టీడీపీ ప్రభుత్వం ఉంటే తనకి అదనంగా లభించే లబ్ది) ఆయన భావిస్తున్నారు దానికి కారణం కూడా విద్యా దీవెన, వసతి దీవెనలే.. లోకేష్ భరోసాతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మళ్లీ ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి సిద్ధమయ్యారు. దానికోసం ఈయన కూడా మరో నారాయణ అవ్వగలడు అని రాజకీయ వర్గాల బోగట్టా..
పేద, మధ్యతరగతి వర్గాలకి మేలు జరుతుంటే ఏ కార్పొరేట్ వ్యవస్థా భరించలేదు. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా చేయగలిగే లాబీ వలన వారే వీరి వ్యాపారానికి బలం. అందుకే ఎట్టిపరిస్థుల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని ఈ కార్పోరేట్ వర్గాలన్నీ ఒకటవుతున్నాయి. కానీ జగన్ జనాలని బలంగా నమ్ముతున్నాడు. అందుకే మీకు మంచి జరిగితేనే నాకు ఓటెయ్యండి అంటున్నాడు తప్ప, నేనేసిన రోడ్లు, నేనేసిన నాట్లు అని బలవంతం చేయడం లేదు. బెదిరింపులకి దిగడం లేదు. చూద్దాం.. జగన్ నమ్మకం ఎంతవరకు జనాలు నిలబెడతారో…