పెడన టికెట్ను బాబు కాగిత కృష్ణప్రసాద్కు ప్రకటించారు. దీంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2019లో బాబును నమ్మి టికెట్ వదులుకుంటే ఇప్పుడు మోసం చేశారని ఆవేదన చెందారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సీట్లు ప్రకటించారు. ఇందులో 94 చోట్ల తన పార్టీ అభ్యర్థులు ఎవరో వెల్లడించారు. దీంతో అటు టీడీపీలో, ఇటు జనసేనలో టికెట్లు దక్కని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబును నమ్మి నిండా మునిగామని భగ్గుమంటున్నారు.
పెడన టికెట్ను బాబు కాగిత కృష్ణప్రసాద్కు ప్రకటించారు. దీంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2019లో బాబును నమ్మి టికెట్ వదులుకుంటే ఇప్పుడు మోసం చేశారని ఆవేదన చెందారు. కార్యకర్తల సమాశంలో వేదవ్యాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బాబు, పవన్ను కలిసి నిలదీస్తానని ఆయన ప్రకటించారు. ఇండింపెండెంట్గా పోటీ చేస్తానన్నారు.
జగ్గంపేట సీటును జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)కు టీడీపీ కేటాయించింది. దీంతో జనసేన నేతలు అసంతృప్తికి లోనయ్యారు. ఇక్కడి సేన ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర తనకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని, గొంతు కోశారని విలపించారు.
రాయచోటి సీటును టీడీపీ మండిపల్లి రామ్ప్రసాద్కు ఇచ్చింది. దీంతో బరిలో ఉండాలని ఆశించిన ఇన్చార్జి రమేష్రెడ్డి అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. తన సంప్రదించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇది చంద్రబాబు అనాలోచిత నిర్ణయం అన్నారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇప్పటికే 11 మంది క్లస్టర్ ఇన్చార్జిలు, 300 మంది బూత్ కమిటీ సభ్యులు తదితరులు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
కల్యాణదుర్గంలో అమినేని సురేంద్రబాబు అనే కాంట్రాక్టర్కు బాబు టికెట్ అమ్మేశారు. దీంతో ఇప్పటి వరకు కష్టపడిన హనుమంతరాయ చౌదరి బాధపడుతున్నారు. ఆయన వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసింది. వ్యతిరేకంగా నినాదాలు చేసింది.
గజపతినగరం టికెట్ను కొండపల్లి శ్రీనివాస్కు కేటాయించారు. దీంతో బరిలో ఉండాలని ఉవ్విళ్లూరిన అప్పలనాయుడుకు నిరాశ ఎదురైంది. వెంటనే పార్టీ కార్యాలయంలో అనుచరులతో భేటీ అయ్యారు. టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు.
మొత్తానికి పొత్తు కారణంగా అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు చాలామంది అన్యాయమైపోయారు. తమకు అధినేతలు సీట్లు ఇస్తారని చాలామంది ఆశించారు. అయితే అలా జరగలేదు. పవన్ ఐదు సీట్లు మాత్రమే ప్రకటించి మిగతావి సస్పెన్స్లో పెట్టడం.. బాబు 57 సీట్లు వెల్లడించాల్సి ఉండటంతో మొన్నటి వరకు మేమే అభ్యర్థులం అనుకున్న వారంతా డైలమాలో పడిపోయారు. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే వారికే మిగతా సీట్లు ఇస్తారని భయపడుతున్నారు.