చంద్రబాబు శనివారం తొలి జాబితా విడుదల చేశారు. ఇందులో ఉదయగిరి సీటును కాకర్ల సురేష్ అనే వ్యక్తికి ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి బొల్లినేని రామారావుకే హ్యాండ్ ఇచ్చారు. ఈయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్గా ఉన్నారు.
పెడన టికెట్ను బాబు కాగిత కృష్ణప్రసాద్కు ప్రకటించారు. దీంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2019లో బాబును నమ్మి టికెట్ వదులుకుంటే ఇప్పుడు మోసం చేశారని ఆవేదన చెందారు.