ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీలు లాంటి వాటితో పౌర సేవలను చంద్రబాబు భ్రష్టు పట్టించడంతో అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో వలంటీర్ వ్యవస్థను తెచ్చారు జగన్.
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్ తెచ్చిన ఈ వాలంటీర్ల వ్యవస్థ జగన్ అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపునే తెచ్చుకుoది. పెన్షన్ అందిచడంతో పాటు ప్రతీ ప్రభుత్వ సేవను గడప వద్దకే చేరుస్తూ పరిపాలనలో ఒక సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఈ వ్యవస్థపై వ్యతిరేకత వెళ్ళగక్కుతూ తరుచుగా కామెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.
గోనె సంచులు మోసే ఉద్యోగం అని ఒక సారి, వాలంటీర్లకి పిల్లనివ్వరని మరోసారి, ఇళ్లల్లో మగాళ్లు లేనప్పుడు తలుపులు తడుతున్నారని ఇంకోసారి నోటికి అడ్డు అదుపూ లేకుండా మాట్లాడారు. ఆయనతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ సైతం వాలంటీర్లపై సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని సంఘవిద్రోహ శక్తులకి ఇవ్వడం మూలానే రాష్ట్రంలో ఆడపిల్లలు మాయం అవుతున్నారని మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.
అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వం చేసే ప్రతీ పనిని కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వాలంటీర్లపై కూడా కోర్టుకు పోయి చీవాట్లు తిన్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలో నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్లు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు సేవలను సీఎం జగన్ కొనియాడటం వారిని సత్కరించడం చట్ట విరుద్దం అంటూ తన మనుషులచేత ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయించారు చంద్రబాబు. దీనిపై విచారించిన హైకోర్టు దర్మాసనం వలంటీర్లు సేవలను సీఎం జగన్ కొనియాడటం చట్టవిరుద్ధంగా ప్రకటించడమేమిటని ప్రశ్నించింది. మంచి చేసిన వాళ్ళను సన్మానించకూడదా అని ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన సొమ్మును ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరుతారని తీవ్రంగా మందలించి పిటీషన్ కొ ట్టివేసింది హై కోర్ట్