వలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇంకా కోపం తగ్గలేదు. పైకి ఎన్నికల సభల్లో మాత్రం వారిపై ప్రేమ నటిస్తూ.. లోపల దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నారు. వారిని సాధించే క్రమంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇబ్బంది పెడుతున్నారు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అని టీడీపీ జేబు సంస్థ ఒకటి ఉంది. దీనిని నిర్వహించేది రాష్ట్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రవేష్కుమార్. ఆ సంస్థ పనేంటంటే చంద్రబాబు చెప్పినట్లుగా వలంటీర్లపై కోర్టుల్లో కేసులు వేయడం. […]
‘స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వలంటీర్ల జీవితం మారుస్తాం. వారు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తాం’ కుప్పం పర్యటనలో మంగళవారం యువతతో జరిగిన సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మాటలివి. ఆయన నోటి వెంట మళ్లీ స్కిల్ డెవలప్మెంట్ అనే పదం విని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడిపోతున్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలు గుర్తొచ్చాయి కాబోలు.. శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి వలంటీర్లను […]
వాలంటీర్లను గౌరవం భృతి తీసుకుని పని చేసే సేవకులుగా జగన్ ప్రభుత్వం చూసినప్పటికీ… టీడీపీ మాత్రం మొదటి నుంచీ వారిని వైసీపీ అనుచరులలానే భావిస్తోంది. ఎన్నో సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థ వలన కలిగిన లాభాలు, ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ వంటివి కళ్ళ ముందు ఉన్న కేవలం రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ వాలంటీర్లను వ్యతిరేకిస్తుంది. ఈ నేపధ్యంలో ఎన్నికలలో ఏ విధమైన డ్యూటీకి వాలంటీర్లను వాడబోమని వైకాపా స్పష్టం చేసింది. అయినా టీడీపీ పదేపదే వాలంటీర్ల వ్యవస్ధను అనుమానిస్తున్న […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీలు లాంటి వాటితో పౌర సేవలను చంద్రబాబు భ్రష్టు పట్టించడంతో అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో వలంటీర్ వ్యవస్థను తెచ్చారు జగన్. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్ తెచ్చిన ఈ వాలంటీర్ల వ్యవస్థ జగన్ అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తూ దేశ […]
ప్రజల ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలను చేర్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.60 లక్షల మందితో కూడిన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు ఉంటారు. 2019 ఆగస్ట్ 15వ తేదీన ఈ వ్యవస్థను ప్రారంభించారు. వీరి సేవలకు ప్రజానీకం సలాం కొడుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అక్కసు వెళ్లగక్కారు. ప్రతి సభలో వారిని తిట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా స్క్రిప్ట్ ప్రకారం వారిని సంఘ విద్రోహ […]
ప్రభుత్వ పాలనను ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజలు వద్దకు తీసుకెళ్ళడంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిన వాలంటీర్లను జగన్ ప్రభుత్వం వివిధ అవార్డులతో సత్కరించనుంది. కేవలం గౌరవ భృతితో పని చేస్తున్న వాలంటీర్లకు ఈ వార్త ప్రోత్సాహం కలిగించనుంది. 2.55 లక్షల మంది వలంటీర్లకు అవార్డులు..పురస్కారాలు లభించనున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఈ అవార్డులను అందించనున్నారు. అవార్డుల వివరాల్లోకి వెళితే… ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతుంటారు. పచ్చ పత్రికలైతే రోజూ వారిపై బురద వేస్తుంటాయి. కానీ ఆ సేవా సైన్యం ఏ మాత్రం కూడా నెరవకుండా తమ పని చేసుకుంటూ వెళ్తుంటారు. ఎక్కడో ఒకరు చేసే తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించి చూసే ఎల్లో గ్యాంగ్కు వారి మంచి పనులు కనిపించవు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో తల్లి మందలించిందని గోపీచంద్ అనే 17 ఏళ్ల […]