దేశంలో ఎక్కడ లేని రాజకీయాలు కుట్రలు, ఎత్తులకు పైఎత్తులు ఏపీ లో జరుగుతున్నాయి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన వాలంటీర్ వ్యవస్థ గత 55 నెలలుగా గ్రామ గ్రామాన, వీధి వీధి కి చేరి ప్రజలకూ చేదొడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఎక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ తమకు అడ్డుగా ఉంటుందోనని భయపడిన టీడీపీ మొదటి నుండి ఈ వ్యవస్థ మీద విషం చిమ్ముతూ వస్తున్నారు. మొదట గోనె సంచులు మోసే ఉద్యోగం అని , మగవాళ్ళు లేనీ టైం లో ఇంటి తలుపులు కొడుతున్నారు అని వాలంటీర్లను మానసికంగా టీడీపీ వేధించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా పిలవబడే పవన్ కళ్యాణ్ ఇంకో రెండు మెట్లు దిగజారి వాలంటీర్ల వలన మహిళలు కిడ్నాప్ లకు గురి అవుతున్నారు అంటూ అత్యంత హీనమైన ఆరోపణలు చేశారు. చివరకు వాలంటీర్ల నుండి సామాన్య ప్రజల నుండి చివరకు సొంత పార్టీ నుండి వ్యతిరేకత రావడంతో అందరూ కాదు కొందరు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీ లో ఎలక్షన్స్ మొదలవ్వగానే వాలంటీర్ల మీద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్, వారి అనుకూల మీడియా అన్ని వైపుల నుండి మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. మేము వస్తే మీ ఉద్యోగాలూ తీసి వేస్తామని, మిమ్మల్ని వదిలిపెట్టమని తరిమి తరిమి కొడతాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వలంటీర్లు ఫించన్ ఇవ్వకూడదు అంటూ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారు. అంతటి తో ఆగకుండా ఏ ఓక్క సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందివ్వకూడదని ఫిర్యాదు చేసి అడ్డుకున్నారు. చివరకు ఎలక్షన్ అయ్యే వరకు వాలంటీర్లు ఏ ఒక్క పని చేయకూడదు అని కేంద్ర ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది.
దీనితో ఇన్ని రోజులు ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో, తుఫాను సమయాల్లో ప్రాణాలకు తెగించి కుల, మత తేడాలు లేకుండ పార్టీలు చూడకుండా సేవలు అందించిన మా మీద కూటమి లోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మటాన్ని తట్టుకోలేక కింద కుప్పం నుండి మొదలు కొని , కోస్తాంధ్ర అయిన ఒంగోలు మీదుగా , ఉత్తరంద్ర లో పెందుర్తి లో ఇలా ప్రతి చోట తమ వాలంటీర్ల ఉద్యోగాలకి రాజీనామా చేసి తమను తమ వృత్తిని హేళన చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను వాళ్లు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని ఓడించి తీరుతామని వలంటీర్లు శపథం చేశారని తెలుస్తుంది. టీడీపీ, జన సేన వాలంటీర్లను మానసికంగా హింసించడం తాజాగా ఆయా పార్టీల వారి పాలిట ఉరి కాబోతుంది.