అధికారం లోకి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కొంటామనీ, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరిగితే దాని పేర ఉన్న భూముల్ని జగన్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని లోకేష్ విమర్శించాడు…
అయితే….
ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేసేది ఆ సంస్థ నష్టాల్లో నడుస్తుంది అని, ఒకవేళ దానిని కొనడానికి ఎవరైనా ముందుకు వచ్చి కొనేస్తే, ఆ సంస్థకి చెందిన ఆస్తులు, అప్పులూ అన్నీ వాళ్ళకే చెందుతాయి… ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసినా, దాన్ని కొన్నవారు ఆ సంస్థ యొక్క ఆస్తులైన భూములు కూడా వారికే చెందుతాయి. సంస్థ యొక్క పనితనం బాగాలేకున్నా, కార్పోరేట్ సంస్థలు వాటిని కొనడానికి ముందుకు వచ్చేది ఆ సంస్థ యొక్క ఆస్తుల విలువ చూసే.. కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థని కేంద్రమే ప్రైవేటీకరిస్తుంటే ఆ సంస్థ యొక్క భూములను జగన్ అయినా ఇంకొకరయినా కొట్టేస్తే కొనేవాడు ఊర్కోడు కదా? అది సాధ్యమయ్యే పని కాదు….
గుడ్డ కాల్చి మొహాన విసిరినట్టు, అర్థం లేని విమర్శ చేసి దాని తాలూకు బురదని మీరే కడుక్కోండి అన్న చందాన, ఇలాగే లక్ష కోట్ల అవినీతి చేసాడని ఒక అబద్దాన్ని వందల సార్లు చెప్పీ, చెప్పీ నిజమని నమ్మించారు అప్పట్లో… తర్వాత తర్వాత ప్రజలకి మెల్లిగా అర్థం అయింది రాష్ట్ర బడ్జెట్టే లక్ష కోట్లు లేని సమయం లో లక్ష కోట్ల అవినీతి ఏంటని?
ఇప్పుడు ప్రజలు తెలివి మీరారు, సోషల్ మీడియా యుగం ఇది… లాజిక్ లేకుండా దేన్నీ నమ్మే స్థితిలో ప్రజలు లేరిపుడు…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనడం సాధ్యమా?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తం విలువ 2022 లోనే 3 లక్షల కోట్ల కన్నా ఎక్కువ.. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేటు తో కలుపుకుంటే దాదాపు దాని విలువ 3.5 లక్షల కోట్లు అవుతుంది…. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ కొనడం సాధ్యమేనా? మన రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ విలువ ఉన్న ఒక సంస్థని ప్రభుత్వం కొనగలదా? అసాధ్యం….
ప్రైవేటీకరణను వ్యతిరేకించే నైతికత టీడీపీ కి ఉందా?
1995 నుండి 2004 మధ్యలో దేశం లో 84 సంస్థలను ప్రైవేటీకరిస్తే అందులో 54 సంస్థలు కేవలం ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జరిగాయి…
అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయిన నిజం సుగర్స్ 500 కోట్ల విలువ చేసే సంస్థని కేవలం వంద కోట్లకి చీప్ గా అమ్మేసారు.. దానికి ప్రతిగా 160 కోట్ల ముడుపులు అప్పటి సీఎం గా ఉన్న బాబు కి అందాయని జాతీయ మీడియా కోడై కూసింది… 100 కోట్ల విలువ చేసే చిత్తూర్ షుగర్ ఫ్యాక్టరీ ని 15 కోట్లకే కట్టబెట్టారు… ఇలా చెప్పుకుంటూ పోతే, నష్టాల్లో ఉన్నవే కాకుండా లాభాల్లో ఉన్న వాటిని, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థలను, వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమ్మలాంటి సంస్థలను రాత్రికి రాత్రే కేవలం ఒక్క జి.వో ద్వారా మూసేసి కార్మికులను రోడ్డు పాలు చేసారు…
2014 లో కూడా జీవో 289, 290 తీసుకొచ్చి చక్కెర ఫ్యాక్టరీ లని అమ్మేసీ తన సహజ స్వభావాన్ని నిరూపించుకున్నాడు బాబు…
అసలు చంద్ర బాబు అంటేనే ప్రైవేటీకరణకు కిరీటం లేని చక్రవర్తి లాంటి వ్యక్తి… … అలాంటిదీ లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రైవేటీకరణ ని అడ్డుకుంటానని, రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందనీ, జగన్ ఆ భూముల్ని కొట్టెయ్యాలని చూస్తున్నాడు అని…. అర్థం లేని స్టేట్మెంట్ లు ఇవ్వడం బహు హాస్యాస్పదం…