రుషికొండ పై నిర్మించిన ఆంధ్రప్రదేశ్సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఏపీ పర్యాటక అభివృధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 433 కోట్ల ఖర్చుతో అంతర్జాతయ ప్రమాణాలతో నిర్మించిన 8 బ్లాక్ లు పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యాయి. క్యాంప్ కార్యాలయం, అధికారులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ నిర్మాణాలు, భద్రత పరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది యంత్రాంగం.గతంలో హరిత రిసార్ట్స్ ఉన్న ఇదే ప్రాంతంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండకుండా ఉండేలా అనగా సీఎం హోదాలో తిరుగుతుంటే ప్రోటోకాల్ రీత్యా ప్రజలని ఆపేయాల్సిన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇక్కడ ఏర్పాటు చేశారని సమాచారం . దీని ద్వారా వైజాగ్ సిటీలో ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఉండదు. అలాగే భద్రత కారణాల దృష్ట్యా ఇది అనువైన ప్రదేశం కూడా. కాగా ప్రారంభోత్సవం పైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భవన సముదాయాల నిర్మాణం పై మొదట ప్రతిపక్షం అనేక కేసులు వేయగా అన్ని కేసులు వీగిపోయాయి. త్రిసభ్య కమిటీ కూడా రుషికొండ హిల్స్ సీఎం క్యాంప్ ఆఫీస్ కు అనువైన ప్రదేశం అని తెలిపింది.