ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశాఖ ఒక దిక్సూచిగా నిలువనుంది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్రెడ్డినవ్యాంధ్రని అభివృద్ధిలో ముందుకి తీసుకొని వెళ్లాలంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచి పెట్టుబడులని ఆకర్షిస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకి వెళుతుందని భావించి విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించారు.
విజన్ విశాఖ పేరుతో నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాష్ట్ర అభివృద్ధితో పాటు విశాఖ నగర ప్రాముఖ్యతను, విశాఖ నగరానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తు గురించి చర్చించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల అభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి సీఎం జగన్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 2000 మంది హాజరయ్యారు. విశాఖ నగరాన్ని అటు పారిశ్రామికంగా, ఇటు పర్యాటకంగా అభివృద్ధి చేసి గ్లోబల్ సిటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.
విశాఖ వేదికగా ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి విశాఖనే వేదికయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే జీ20 సమావేశాలు కూడా విశాఖలో జరిగాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి 13 లక్షలు పైగా పెట్టుబడులని ఆకర్షించింది జగన్ ప్రభుత్వం. కాగా ఇప్పటికే ఆర్థిక పరివర్తన గల నాలుగు నగరాలని నీతి అఆయోగ్ ఎంపిక చేస్తే అందులో విశాఖ చోటు దక్కించుకుంది. ఆర్థిక పరివర్తన గల నగరాలకి నీతి అయోగ్ రానున్న 20 సంవత్సరాలకి నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ప్రణాళికని ఇస్తుంది.