మాజీ యంపీ లావు గొంతు సన్నబోతోంది. విశాఖనూ, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన భారీ డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు సంబంధించినది కాగా, ఆ సంధ్య ఆక్వా టీడీపీ పెద్దలకు బాగా కావాల్సినవాళ్ళది. పైగా సొంత సామాజిక వర్గం వాళ్ళది.
దాంతో వెంటనే సోషల్మీడియాలోకి దిగిపోయిన తెలుగుతమ్ముళ్లు ఆ మురికిని వైసీపీకి అంటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ సోషల్మీడియా వారు కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో… వైసీపీ అఫిషియల్ ఖాతా నుండి సంధ్య ఆక్వా సీయీఓ అయిన కూనం కోటయ్య చౌదరి తెదెపా నాయకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలని పోస్ట్ చేసింది.
దీనితో ఉలిక్కి పడ్డ ఆ పార్టీ నేతలు భుజాలు తడుముకునే పనిలో పడ్డారు. అలా మాజీ యంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీ పేజీ వేసిన ట్వీట్ను రీ షేర్ చేస్తూ… ఏదైనా అభిప్రాయానికి వచ్చే ముందు ప్రజలు ఒక్కసారి నిజానిజాలను గమనించాలని సంధ్య ఆక్వా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ను జతపరిచారు.
వైసీపీ సోషల్ మీడియా నిందితులు కేవలం లావుతో సన్నిహితంగా ఉన్న ఫోటోని మాత్రమే వేశారు, లావు కి ఈ డ్రగ్స్తో సంబంధం ఉందని అనలేదు , కానీ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకొన్నట్టు ఉలిక్కి పడ్డ లావు ఆ కేసుతో, ఆ వ్యక్తులతో తనకి సంభంధం లేదు అనకుండా సదరు కంపెనీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ పోస్ట్ చేస్తూ వారికి సంభందం లేదని వకాల్తా పుచ్చుకోవటంలోనే వారు తన సన్నిహితులు అని కంఫర్మ్ చేసినట్లు అయ్యింది.
వైసీపీ వారు కేవలం లావు ఫోటోని మాత్రమే వేసారు కానీ, లావు చేసాడని చెప్పలేదు కదా? మరెందుకు ఈ తాపత్రయం? అంతే కాక, కంపెనీ వారు ఇచ్చిన ప్రెస్ నోట్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారనీ, నార్కోటిక్ వారికి సమాధానం చెప్పడం మానేసి ఇలా ప్రెస్నోట్స్ ఇవ్వడమేంటి అని సోషల్మీడియా వేదికగా అందరూ లావునీ ఎద్దేవా చేస్తున్నారు. అలా పాపం లావు అనవసరంగా సంధ్య ఆక్వా వాళ్ళని వెనకేసుకొచ్చి, విమర్శకుల నోటికి చిక్కాడు.
ఈ విధంగా వారు తమ వారే అని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కంఫర్మ్ చేస్తుండగా, మరో వైపు టీడీపీ మీడియా మాత్రం వారు వైసీపీ వారు అని దుష్ప్రచారం చేయడం చూస్తే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది.