‘మా తాతయ్య ఉద్యోగ రీత్యా చాలా ఊర్లు తిరిగారు. మా పెదనాన్న చిరంజీవి సినిమాలు చేయడం ప్రారంభమయ్యాక హైదరాబాద్లో సెటిలయ్యారు. మా కంటూ సొంతూరు లేదు. బాబాయ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. రేపొద్దున పండగలొస్తే మీ సొంతూరు ఎక్కడంటే పిఠాపురమని చెప్పుకొంటాం’ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆదివారం పిఠాపురం ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలివి.
ప్రజల్ని మభ్యపెట్టడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒకడుగు ముందుంటుందని వరుణ్ మాటల ద్వారా మరోసారి నిరూపితమైంది. పవన్ ఏదైనా ఊరు వెళ్తే అక్కడే పుట్టానని చెప్పుకొంటుంటాడు. లేకపోతే ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటే బాగుండేదంటుంటాడు. మెగా ఫ్యామిలీ ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. ఆ ప్రాంతంలోనే వారికి వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇప్పుడొచ్చి పిఠాపురాన్ని సొంతూరుగా చెప్పుకొంటామని వరుణ్ చెప్పడం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను ఈయన బట్టీ పట్టి చదివేశాడు.
బెంగళూరులో చిరంజీవికి ఫామ్హౌస్ ఉంది. పండగలు, ఇతర కార్యక్రమాలన్నింటిని మెగా ఫ్యామిలీ అక్కడే చేసుకుంటుంది. సొంతూరు మొగల్తూరుకే ఎప్పుడూ వెళ్లిన దాఖలాల్లేవు. ఇప్పుడు పిఠాపురంలో చేసుకుంటామని జనంలో చెవిలో పూలు పెట్టాలని చూశాడు వరుణ్. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాకలో పోటీ చేశాడు. గెలిచినా.. ఓడినా ఇక్కడే ఉండిపోతానంటూ ప్రజలకు చెప్పాడు. దారుణ పరాజయం తర్వాత ఆ ఊర్లలో అడుగు పెట్టడానికి చాలాకాలమే పట్టింది. అసలు వరుణ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ల బాబాయ్కి ఓటు హక్కు ఉండేది మంగళగిరిలో.. పిఠాపురంపై అంత ప్రేమ ఉంటే ఇక్కడే నమోదు చేయించుకోవచ్చు కదా.
ఇకపోతే నాగబాబు ఫ్యామిలీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వెంటనే మంగళగిరికి మార్పించుకున్నారు. రేపు ఇక్కడ ఎన్నికలయ్యాక హైదరాబాద్కే కదా వెళ్తారు. పిఠాపురంలో ఎందుకు ఓటు పెట్టుకోలేదు. పవన్ ఏపీలోనే సక్రమంగా ఉండడం లేదు. రెండు రోజులు తిరిగితే మూడురోజులు హైదరాబాద్లో సేద తీరుతాడు. అలాంటాయన పిఠాపురాన్ని సొంతూరిగా భావిస్తాడంటే జనసైనికులే నమ్మరు. మెగా ఫ్యామిలీకి రాజకీయం చేతకాదని చాలామంది అనుకుంటుంటారు. అసలు విషయం ఏంటంటే వాళ్లకి రాజకీయాల్ని ఎలా వాడుకోవాలి? ఎలా సంపాదించాలో బాగా తెలుసు. బాబూ మెగా ప్రిన్స్ కాస్త పక్కకెళ్లి ఆడుకోమ్మా..