విశాఖ విమానాశ్రయంలో నాటి ప్రతిపక్షనేత ప్రస్తుత సీఎం గా ఉన్న వైయస్ జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం చేసిన జానపల్లి శ్రీనివాస అలియాస్ కోడికత్తి శ్రీను ఎట్టకేలకు ముసుగు తీసేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో సహా ముమ్మిడివరం కూటమి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు ఆద్వర్యంలో టీడీపీలో చేరారు. అయితే వారు మొదటి నుండి టీడీపీకి చెందిన వారే అయినా మళ్ళీ కొత్తగా టీడీపీలో చేరినట్టు ఆడుతున్న నాటకం వెనుక చంద్రబాబు కుటిల రాజకీయ ఎత్తుగడ ఉందనే వాదన వినిపిస్తుంది. .
జగన్ పై విశాఖలో దాడి జరిగిన కేసు కేంద్ర సంస్థైన ఎన్ఐఏ పరిధిలో ఉన్నా, ఇన్నిరోజులు జానపల్లి శ్రీనివాస్ కి బెయిల్ రాలేదని టీడీపీ నేతలు ఎంత భాదపడిపోయారో ప్రజలందరూ చూస్తూనే వచ్చారు, నిజానికి తెలుగుదేశం పాలనలోనే జగన్ పై చేసిన ఈ దాడి హతమార్చడానికే అని స్పష్టంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో రాశారు, అయినా ఆ విషయం మరుగున పరుస్తూ ఇన్నిరోజులు టీడీపీ మాట్లాడడం వారి కుట్రలో ఒక భాగంగానే చూడాలని ప్రజలందరు చెప్పే మాట.
నిజానికి శ్రీను మొదటి నుండి టీడీపీ మనిషే అనటానికి బలమైన సాక్ష్యాలే ఉన్నాయి. టీడీపీ లీడర్ కి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ లో పనివాడు ఇతను, ఈ శ్రీను కి టీడీపీ లీడర్ అయిన, ఫ్యూజన్ ఫుడ్ ఓనర్ హర్షవర్ధన్ కి చెందిన ఎయిర్పోర్ట్ హోటల్ లో పని చేస్తూ అక్కడి నుండి కోడి కత్తితో భద్రతా సిబ్బందిని దాటుకుని ఎయిర్ పోర్టులోకి శ్రీను ఎలా వచ్చాడో.. వీడి మీద పాత కేసులు ఉన్నా సరే అవి పక్కన పెట్టి హర్ష వర్ధన్ ఇతనికి ఎయిర్ పోర్టు లో ఉండే తన ఫ్యూజన్ ఫుడ్ హోటల్ లోనే ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో, లాంటి ప్రశ్నలకి ఇప్పటికి టీడీపీ నుండి సమాధానం లేదు. ఎవరు ఎన్ని డ్రామాలు వేసిన ఏదో ఒక రోజు ముసుగు తొలగిపోతుంది , ఈ రోజు ఈ శ్రీను విషయంలో టీడీపీ ముసుగు తొలగిపోయిందని ప్రజల అభిప్రాయంగా చెబుతున్నారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ అని ప్రకటించిన లోకేష్ ఈ శ్రీనుకి కూడా పార్టీలో ఒక పెద్ద పోస్ట్ ఇచ్చేస్తాడేమో చూడాలి.