టీవీ5 యాంకర్ సాంబశివరావు చూసేందుకు అమాయకుడిలా కనిపిస్తాడు. నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుంటాడు. నీతులు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ చేసే పనులు చూస్తే ఔరా సాంబా అనాల్సిందే. ఈ పచ్చ యాంకర్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నాడు. అక్రమార్జన కోసం ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతడిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రతిపక్ష నేతలు, వారి సన్నిహితులు, కొందరు వ్యాపారుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనేకమంది లీలలు బయటపడుతున్నాయి. ప్రణీత్రావు, ప్రభాకరరావు, భుజంగరావుతోపాటు సాంబశివరావు తనను వేధింపులకు గురి చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ వ్యాపారవేత్త, సంధ్య కన్వెన్షన్ అధినేత శరణాల శ్రీధర్రావు తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఎల్లో మీడియాకు చెందిన సాంబ పేరు బయటకు రావడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు.
శ్రీధర్రావు జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు పలు వ్యాపారాలున్నాయి. 2017-18 మధ్య సాంబశివరావు.. శ్రీధర్రావు వద్దకు వెచ్చి మీకు వ్యాపారంలో సహాయం చేస్తా.. ఆర్థిక కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకోవాలని కోరాడు. ఆయన ఒప్పుకొని సాంబ ఉంటున్న ఇంటికి సైతం ప్రతినెలా అద్దె చెల్లించారు. అలాగే జీవన భృతి కోసం తనకు చెందిన కమర్షియల్ ప్లాట్లలో ఒక దానిని పెట్రోల్ బంకు పెట్టుకోవడానికి సాంబశివరాకు ఇచ్చి సాయం చేశారు. ఈ పచ్చ యాంకర్ కొన్ని సెటిట్మెంట్ల వ్యవహారాల్లో అదనపు ఎస్పీ భుజంగరావు (ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు) వద్దకు శ్రీధర్రావును తీసుకెళ్లారు. అయితే అక్కడి పరిస్థితులు ఏ మాత్రం నచ్చకపోవడంతో ఆయన వెనక్కి వచ్చేశారు. ఇక్కడే సాంబశివరావు తన దుర్మార్గపు బుద్ధిని బయటపెట్టారు. వ్యాపారం ఎలా చేస్తావో చూస్తామంటూ శ్రీధర్రావును బెదిరించారు. ఆయన వ్యాపారాల్లో తలదూర్చడం, పోలీస్ స్టేషన్లలో తప్పుడు ఫిర్యాదులు పెట్టించి వేధించడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తే శ్రీధర్రావు తన దారిలోకి వచ్చి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తాడని సాంబ భావించారు.
శ్రీధర్రావు ఫోన్ను ట్యాపి చేయించారు. ఆయన ప్రతి కదలికను తెలుసుకున్నారు. ఎవరితో మాట్లాడినా వివరాలు సేకరించారు. వ్యాపార సంబంధ విషయాలపై చిచ్చు పెట్టేలా సాంబశివరావు, భుజంగరావు వ్యవహరించి ఆయన్ను మానసికంగా హింసించారు. దీంతో శ్రీధర్రావు విసిగిపోయారు. సాంబశివరావు, భుజంగరావు, ప్రభాకరరావు, ప్రణీత్రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కీలకపాత్ర పోషించింది పచ్చ యాంకరేనని ఆరోపణలున్నాయి. శ్రీధర్రావుపై ఉన్న కోపంతో సాంబశివరావు తన పరిచయాలతో ఫోన్ ట్యాప్ చేయించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ వ్యవహారం ఆయనకు ముందుగానే తెలుసని ప్రచారం ఉంది. విలువలు కలిగిన జర్నలిస్ట్ అని చెప్పుకొనే సాంబ ఈ విషయాన్ని బయట పెట్టకుండా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎంతైనా చంద్రబాబు భక్తుడు కదా.. అక్రమాలు చేసి డబ్బు మూటగట్టుకోవడానికి బాగా అలవాటు పడ్డాడు. ఇప్పుడు డిబేట్ పెట్టి ఇదంతా జగన్ కుట్ర అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్లకి తెలిసింది అదే కదా.. తప్పు చేయడం.. బయట పడ్డాక వైఎస్సార్సీపీ కుట్ర అనడం. తప్పు గురించి మాట్లాడరు. వెలుగులోకి తెచ్చిన వారిపై పడి ఏడుస్తుంటారు.