మొన్న వాలంటీర్, నిన్న బెండపూడి స్కూల్ పిల్లలు, నేడు ఓ సామాన్య గృహిణి….
జగన్ కు కొంచెం సపోర్ట్ గా మాట్లాడినా చాలు, జగన్ తెచ్చిన సంక్షేమం అందుతుంది అని చెప్తే చాలు, జగన్ చేసే మంచి ఎవరి ద్వారా అయినా ఎక్స్పోజ్ అయితే చాలు వాళ్ళని నానా హింస పెట్టాలి. పెద్దా లేదు చిన్నా లేదు, ఆఖరికి స్కూల్ కి వెళ్లే పసి పిల్లలు అని కూడా లేదు. ట్రోల్ చేయాల్సిందే. వాళ్లకి నచ్చని మాట మాట్లాడితే మానసికంగా హింసించాల్సిందే..
వాలంటీర్ గా పని చేస్తున్న ఓ మహిళను బీడీ లు తీసుకురా, సిగరెట్లు తీసుకురా అంటూ నీచంగా మాట్లాడి ఆ ఆడబిడ్డ చావుకు కారణం అయ్యారు, ఏం ఇంటిపట్టున ఉంటూ నెల ఖర్చులు తీరతాయి అని 5 వేల జీతం కోసంమో, నలుగురికి సాయ పడాలి అనో, మన ఇంటి చుట్టూ ఉండేవాళ్లంతా మనోళ్లే అనే ధైర్యంతోనో వాలంటీర్ గా ఉద్యోగం చేస్తూ ఇంట్లో మనిషిలా ఉంటూ, ఒకటో తారీఖు పొద్దునే టంచను గా పెన్షన్ తెచ్చి ఇవ్వడం, అవసరమైన సరిఫికెట్స్ దగ్గరుండి ఇప్పించడమేనా వాళ్ళ పాపం జనాలకు మంచి చేస్తే కూడా ఓర్వలేరా?
విద్య కార్పోరేట్ చేతిలో పడి పేదవాడికి చదువును అందని ద్రాక్ష చేసిన ఈ కాలంలో ప్రభుత్వ బడిలో చదువుతూ కార్పొరేట్ స్కూల్స్ లో చదివే పిల్లలకన్నా అద్భుతంగా ఇంగ్లీష్ లో మాట్లాడితే మీ కళ్లు కుట్టుకుంటున్నాయా? మై నేమ్ ఈజ్ మ్యాఘనా సార్ అంటూ ట్రోల్ చేస్తారా? ఆ అమ్మాయి మాట్లాడినట్లు జీవితంలో ఒక్కసారైనా మాట్లాడగలరా? పొట్టకొస్తే అక్షరం ముక్క రాని వాడు కూడా ఆ పిల్లలని అనేవాడే…
ఆ సామాన్య గృహిణి ఏం పాపం చేసింది? జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని, ప్రతీ పేదవాడి అతి పెద్ద కల సొంతిల్లు, ఆ ఆనందాన్ని చూపించడం ఆ ఆడ మనిషి చేసిన పాపమా? తనకి జరిగిన మంచి చెప్పడమే తన పాపమా? నోరు తెరిచి మిమ్మల్ని, మీ అభిమాన పార్టీ ని ఒక్క మాట కూడా అనలేదు కదా? అయినా ఇంత క్రూరత్వమా?
చదువుకోవాల్సిన సమయంలో సరిగా చదువుకోక, సినిమాల మోజులో పడి, ఆ సినిమా హీరో ల కోసం ఫ్యాన్ వార్ లు అంటూ ” మీ అమ్మని తిట్టా, మీ అక్కని తిట్టా, మీ చెల్లిని తిట్టా కానీ మీ హీరోని ఒక్క మాట అనలేదు అది నా సంస్కారం ” అనే నీచపు స్థాయికి దిగి కొట్టుకునే నిషానిలు చేతిలో ఫోన్ ఉంది కదా అని, ఒక మీమ్ పేజ్ ని తయారూ చేసి అడ్డు అదుపు లేకుండా ఎవరినైనా ఏ స్థాయిలో అయినా నీచంగా చిత్రీకరిస్తూ మీమ్ లు వేసి నాలుగు లాఫ్ సింబల్స్ కోసం ఎందుకు ఆ ఆరాటం, మీ పోస్ట్ లు చూసి నవ్వినట్లే మీ బతుకుల్ని కూడా చూసి నవ్వుతారు అది అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ మీకు లేదు..
ఇక ఆ టీడీపీ పార్టీ విషయానికి వస్తే, ఆ పార్టీ పుట్టిన దగ్గర నుండి ఆడవారికి అడుగడునా అవమానాలే, 1983 కి ముందు అసెంబ్లీ ఆర్కైవ్స్ లో వెతికితే అసెంబ్లీ లో ఎంత హుందా చర్చలు జరిగేవో తెలుస్తుంది. ఆడవారికి రాజకీయం ఏం తెలుసు అన్నందుకు కాంగ్రెస్ సభ్యుడైన సుబ్బారెడ్డి ని అందరి ముందు చెప్పుతో కొట్టింది మాజీ మంత్రి గీతారెడ్డి గారి తల్లి ఈశ్వరి భాయి. సభలో ఏ ఇతర సభ్యుడు కూడా దాన్ని ఖండించలేదు. అది అప్పటి హుందా తనం. టీడీపీ అనే పార్టీ పుట్టాక సభలో ఆ హుందా తనం మొత్తం నాశనం అయింది. సన్నపనేని రాజకుమారి ని ఎన్టీఆర్ నిండు సభలో ఏమన్నాడో ఇక్కడ రాయలేని పరిస్థితి, అది మొదలు లక్ష్మీపార్వతి గారిని అన్నమాటలు, ఆ తర్వాత బాబు చేతిలోకి టీడీపీ పడ్డాక ఇంట్లో ఆడవారిని లాగి నీచ రాజకీయాలు చేయడం ప్రతీ దశలో నీచమే..
ఐ టీడీపీ అంటూ లోకేష్ అనే మూర్ఖుడి చేతిలో టీడీపీ సోషల్ మీడియా ని పెట్టిన తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలా ఇంగితం అనేది లేకుండా ప్రవర్తించడం, మీరు ఏదైనా చేయండి మీ వెనుక నేనున్నా, కేసులు ఎక్కువ ఉంటేనే నా అపాయిట్మెంట్ ఇస్తా అంటూ సోమాలియా లో కూడా లేని దిక్కుమాలిన రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేశాడు.జగన్ మంచి చేస్తే ఎలాగూ ఓర్వలేరు, ఇక చేసిన మంచిని చెప్పినా వాళ్లని ఒక్క మాట అనకున్నా వారిపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ వారిని మానసిక హింసకు గురి చేసి బలవంతంగా ప్రాణాలు విడిచేలా చేస్తున్నారు..
ప్రతీ ఫేస్బుక్ పేజీకి, ప్రతీ ఇన్స్టాగ్రామ్ పేజీకి, మీమ్ పేజీలకు నెలవారిగా డబ్బులు ఇస్తూ పొద్దున లేస్తే ఏదో విధంగా దుష్ప్రచారం చేయిస్తూ, ఫేక్ పోస్టింగులు పెట్టిస్తూ, సీఎం ఇంట్లో ఆడవారి మీద కూడా నీచమైన మీమ్ లు వేయిస్తూ రాక్షసానందం పొడుతున్నాడు సోమరిపోతు లోకేష్. ఇప్పటికే తిండి కోసం పొట్ట తప్ప ఆలోచన కోసం బుర్ర లేని ఓ అజ్ఞాని ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే అర్థం తెలియకుండా శాపం లా తయారు అయితే, ఈ చావులకు కారణం అయ్యి వారి ఉసురు పోసుకుంటున్నాడు. తన ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని, అందరూ తన ఇంటిలో ఆడవారి లాంటివారని లోకేష్ కి కనీసం అవగాహన లేకుండా పోతుంది. అంతేలే తండ్రి గుణం ఎక్కడికి పోతుంది.