సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనవాళ్ల మితి మీరిన ట్రోలింగ్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇద్దరు పసి పిల్లలు తల్లి లేని వారయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంకి చెందిన ఒక మహిళకి ఇంటి పట్టా వచ్చింది . ఆ ఇంటి పట్టా తీసుకున్న మహిళ ఇటీవల వైసీపీ సభలో మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్ళ తరవాత తనకి సొంత ఇల్లు కట్టుకోవడానికి జగన్ అన్న ఇంటి స్థలం ఇచ్చాడని ఆ ఇళ్ల పట్టా వచ్చిన ఆనందాన్ని పంచుకుంది. అదే సందర్భంలో మాట్లాడుతూ తన పిల్లలకి అమ్మ ఒడి వస్తోంది, సంక్షేమ పధకాలు అన్ని అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలా ఆనందపడిన కొన్ని రోజుల వ్యవధిలోనే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వేటాడి విపరీతమైన ట్రోలింగ్ కి గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియోని టీడీపీ, జనసేన వాళ్ళు దారుణంగా ట్రోల్ చేయడం ఆ విషయం ఇంట్లోని కుటుంబ సభ్యులకు తెలిసి వాళ్ళు ఆమెను మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరు ఆడబిడ్డలు తల్లి ప్రేమకు దూరం అయ్యారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో టిడిపి జనసేన కార్యకర్తలు అడ్డు అదుపు లేకుండా ఇతర పార్టీల మహిళల్ని వేదించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు . సోషల్ మీడియా వేదికగా పలువురుని హింసించి మానసిక క్షోభకు గురి అయ్యేలా చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై ఫేక్ అకౌంట్ తో ఇలాంటి ట్రోల్స్ చేశారు. ఆ పేరు గల ఒక వ్యక్తి తన పేరు ఉపయోగించుకొని ఇలాంటి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు వారిని కనిపెట్టాలని కడప పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వగా, పోలీసు వారు విచారణ జరిపి టిడిపి కార్యకర్త ఉదయ భాస్కర్ ని అరెస్ట్ చేశారు. అది జరిగిన ఒక నెల కాలంలోనే మళ్లీ ఇంకో మహిళని మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇలాంటి ట్రోల్స్ వేసే వారిని పోలీస్ శాఖ సుమోటోగా కేస్ తీసుకొని దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలి.