జగన్ ప్రభుత్వం విదేశీ విద్యను నీరుగారుస్తుందని టీడీపీ వింత వాదనకు తెరతీసింది. నాడు-నేడు తో మొదలుకొని అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విద్యా వ్యవస్థలో తాను తీసుకొస్తున్న మార్పుల వల దేశ వ్యాప్తం గా అందరి దృష్టి తనవైపుకు మరల్చుకున్నాడు జగన్. విద్యా రంగంలో జగన్ పై చేసే ఏ ఆరోపణ కూడా హేతుబద్ధం అవ్వదు.
ఇక విదేశీ విద్య విషయానికి వస్తే అంకెలే మాట్లాడతాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా గత రెండేళ్లలో నే 2,605 మంది విద్యార్థులకు మొత్తం గా 219.53 కోట్లు చెల్లింపులు చేసింది ప్రభుత్వం. గతం లో ఒక్కో విద్యార్ధికి గరిష్టంగా 15 లక్షలు మాత్రమే చెల్లింపు జరిగేది కానీ ప్రస్తుతం జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా గరిష్టంగా 1.2 కోట్ల వరకు చెల్లిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో 100 లోపు క్యూ యస్ ర్యాంక్ కలిగిన యూనివర్సిటీ లో సీటు సాధిస్తే ఆ యూనివర్సిటీ ఫీజు మొత్తం గరిష్టంగా 1.2 కోట్ల వరకు చెల్లిస్తుంది. 101-200 లోపు ర్యాంకు సాధిస్తే అది 50 లక్షల వరకు ఉంది.. కాగా గత ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి అర్హత సాధించడానికి కుటుంబ ఆదాయం 6 లక్షలు మించరాదు, ఆ పరిమితినీ ఈ ప్రభుత్వం పెంచి 8 లక్షల వరకు ఉండవచ్చని నిర్ణయించింది..
ఇలా అంకెలు నిజాలు చెప్తూనే ఉన్నా, అవాస్తవాలు మీడియా ముందుకు పచ్చ బట్టలేసుకుని వచ్చి ప్రచారం చేస్తుంటాయి. కాకపోతే ప్రజలకి వాస్తవాలు తెలుసు అనే విషయాన్ని వారు విస్మరిస్తుంటారు…