ఎవరి రాజకీయ జీవితాన్ని అంతం చేయాలన్నా బాబు తర్వాతే ఎవరైనా నాయకులను తయారు చేసే పార్టీ మాది, నాయకులని తయారు చేసే మిషిన్ నేను అని చెప్పుకునే బాబు వాస్తవరూపానికి నాయకులుగా అప్పటికే ఎదిగిన వారి రాజకీయ జీవితాన్ని అంతం చేయడం లో దిట్ట..
తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితం అయింది. వైసీపీలో టికెట్ లేదని టీడీపీ లో జాయిన్ అయిన వారికి గతంలో ఇరవై మూడు మందిని వైసీపీ నుండి తమ పార్టీ లోకి జాయిన్ చేసుకుని వారిలో సగం మందికి కూడా టికెట్ ఇవ్వకుండా వాళ్ల రాజకీయ జీవితానికి చరమ గీతం పాడినట్లుగానే ఈసారి కూడా మరోసారి అదే గీతాన్ని ఆలపించనున్నాడు…
తాడికొండ సీట్ ఆశించిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కి టికెట్ నిరాకరించాడు బాబు. ఇదే సీట్ పై ఆశలు పెట్టుకున్న జడ శ్రావణ్ కుమార్ కూడా శ్రీదేవి చేరికతో నిరాశ చెంది బాబు పై దాడి మొదలు పెట్టాడు…
ఇక అదే సీటు ఆశించి గత 5 ఏళ్లుగా అమరావతి ఉద్యమం తలకెత్తుకుని, టీవీ డిబేట్ లలో తన ఆవేశాన్నంతా ప్రదర్శించిన కొలికపూడి శ్రీనివాస్ కు తాడికొండ కాకుండా అసలు గెలుపుకు ఏ కోశానా వీలు లేని తిరువూరు టికెట్ ఇచ్చాడు, ఈ నెల రోజుల్లో తిరువూరు నియోజకవర్గం లో ఎన్ని గ్రామాలున్నాయి అని తెలుసుకోవడమే కష్టం, ఇక కేశినేని నాని లాంటి అభ్యర్థి ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ లో, నాని కళ్ల ఎదుట నిలబడటానికి కూడా భయపడే కొలికపూడి ఇంకేం గెలుస్తాడు…
ఇక వంగవీటి రాధా కి 2019 ఎన్నికల్లోనే టికెట్ ఇవ్వలేదు, ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది రాజకీయ జీవితాన్ని ఇట్టే భస్మం చేసిన ఘనత చంద్రబాబుది.