ఎన్టీ రామారావు నుంచి కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు పూర్తిగా సమాధి కట్టడం ఎంతో దూరంలో లేదు. 2019లో దారుణ ఓటమి చవిచూసిన తర్వాత అంతే స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ పార్టీ ఏకైక ఎంపీ కనకమేడల రవీంద్ర పదవీ కాలం పూర్తయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం స్వయానా బాబే.
2014 నుంచి 19 మధ్య సీఎంగా చంద్రబాబు చేసిన పాపాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. అప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. అయితే కేసులకు భయపడిన బాబు ఎంపీలుగా ఉన్న తన మనుషులు సుజానా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ను బీజేపీలోకి పంపారు. ఆయనే రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయించారు. దీంతో కనకమేడల ఒక్కరే మిగిలారు. నిన్నటితో ఆయన పదవీ కాలం పూర్తవగా ఆర్ఎస్లో టీడీపీ జీఓ అయిపోయింది.
ఇక రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ అవతరించింది. మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ (97), రెండో స్థానంలో కాంగ్రెస్ (29), మూడో స్థానంలో టీఎంసీ (13) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 11 సీట్లకు 11ను వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ గెలుచుకుంది. నేటి నుంచి అధికారికంగా రాజ్యసభలో వైఎస్సార్సీపీ సంపూర్ణ ప్రాతినిధ్యం వహించనుంది. మరికొద్దిరోజుల్లో ఆ పార్టీ కొత్త సభ్యులైన వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మొదటి నుంచి రాజ్యసభ సీట్లను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది. డబ్బు కోసం ధనిక వర్గాలకే అవకాశాలు కల్పించారు. వారు తమ పనులు చేసుకున్నారు తప్ప సమాజానికి ఉపయోగపడే పనులు చేయలేదు. ఉదాహరణకు సీఎం రమేష్ పదవిని అడ్డం పెట్టుకుని బీజేపీ ద్వారా అనేక కాంట్రాక్టులు సంపాదించారు. సుజనా చౌదరి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తి. వీరంతా బాబు దృష్టి ఆర్ఎస్లో ప్రాతినిధ్యం వహించేంత గొప్పవారు. ఇప్పుడు మొత్తంగా జీరో అయిపోవడంతో ఆ వైపు వెళ్లే అవసరం లేకుండా పోయింది. జగన్ మాత్రం వెనుకబడిన వర్గాలను పెద్దల సభకు పంపారు.