వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణం రాజు కు టికెట్ ఇవ్వలేదని తెలుగు దేశం ఆన్లైన్ కార్యకర్తలు తెగ ఫీల్ అయిపోతున్నారు. బాధపడుతూ కొంతమంది పోస్ట్ లు చేస్తుంటే, బీజేపీ ఇంకా వైసీపీ గ్రిప్ లోనే ఉందంటూ ఇంకొంత మంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు..
ఎంపీ గా గెలిచిన నాటి నుండి వైసీపీ వ్యతిరేఖ విధానాలతో, తను గెలిచిన పార్టీ కి వ్యతిరేఖంగానే పని చేస్తూ వచ్చిన రఘురామ కృష్ణం రాజు ఆద్యంతం టీడీపీ కోసమే పని చేస్తూ వచ్చాడు. ఎల్లో మీడియా లో కూర్చుని జగన్ ను, వైసీపీ ని అనరాని మాటలన్నీ అన్నాడు. ఢిల్లీ లో కూర్చుని రోజూ టీవీ డిబేట్ లలో పాల్గొంటూ జగన్ మీద, వైసీపీ నాయకుల మీద విషం కక్కడమే కాకుండా, వైసీపీ కి వ్యతిరేకంగా ఢిల్లీ ల్ లాబీయింగ్ చేయడం, టీడీపీ నాయకులకు అతిథ్యాలు ఇవ్వడం, వారికి కావాల్సిన పనులు చక్కబెట్టడమే అతను చేసిన పని. అంటే ఐదేళ్లు టీడీపీ కోసమే పని చేశాడు.
ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ రఘురాం కృష్ణం రాజుపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందుకు అతని సభ్యత్వాన్ని రద్దు చేయాల్సింది gaa కోరగా ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోలేదు. దానికి బీజేపీ పార్టీ కారణమా? లేక లోక్సభ స్పీకర్ కారణమా అనేది తెలియదు. అలా చూసుకుంటే రఘురామ కృష్ణ కి బీజేపీ అతని “స్థాయి” కి మించి సహాయం చేసినట్టే…
ఇక రఘురామ కృష్ణ ఎన్నడూ బీజేపీ లో జాయిన్ అవ్వలేదు. బీజేపీ కి అతనికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు బీజేపీ అతనికి టికెట్ ఇవ్వలేదని టీడీపీ తమ్ముళ్లు భాధపడటం లో ఏ లాజిక్ ఉందో వారికే తెలియాలి. బీజేపీ లో ఎప్పటి నుండో సేవ చేస్తున్న పక్కా ఆరెస్సెస్ వాది, మోదీ భక్తుడు అయిన సోము వీర్రాజుకే టికెట్ లేని పక్షం లో ఇక పార్టీ లో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని రఘురామ కృష్ణ కి టికెట్ రాలేదని టీడీపీ తమ్ముళ్లు భాద పడటం ఏమిటో…. అతని పని చేసింది అంతా టీడీపీ కోసమే అయినప్పుడు టీడీపీ నుండే అతనికి టికెట్ ఇవ్వచ్చు కదా…!!